Breaking News

Month: August 2020

‘పేట’ కలెక్టరేట్​ ఎదుట కలకలం

సారథి న్యూస్​, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్​పల్లి గ్రామానికి చెందిన నాగప్ప గ్రామంలోని సర్వేనం.230, 225, 248లో 4.20 ఎకరాల భూమి కాస్తులో ఉన్నారు. కాగా, ఈ భూమి గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు పేర పట్టా ఉంది. ప్రభాకర్ రావు మృతి చెందడంతో ఆయన కొడుకు గంగాసాగర్ రావు విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, కొన్నేళ్లుగా తామే కాస్తులో ఉండి పంటలు సాగు చేస్తున్నామని, తమకు పట్టా అమలుచేసి ఇవ్వాలని గంగాసాగర్​రావును […]

Read More

కటుకం రవీందర్​కు నివాళి

సారథి న్యూస్, రామడుగు: ఇటీవల కరోనాతో మృతిచెందిన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పందికుంటపల్లి సర్పంచ్​ కటుకం రవీందర్​కు ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆయన మృతి టీఆర్​ఎస్​ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు నరేందర్​రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకులు పూడూరి మల్లేశం, నేరెల్ల అంజయ్య, ఎడవెల్లి పాపిరెడ్డి, పైండ్ల శ్రీనివాస్, రజబ్ అలీ, […]

Read More

పవన్​ పక్కన పూజా!

ఇప్పటికే వరుస హిట్లతో నంబర్​వన్​గా దూసుకుపోతున్న పూజాహేగ్డే మరో బంపర్​ ఆఫర్​ను కొట్టేసింది. పవన్​ కల్యాణ్​.. హరీశ్​ శంకర్​ డైరెక్షన్​లో చేయబోయే సినిమాలో పూజాకు హీరోయిన్​గా చాన్స్​ దక్కినట్టు సమాచారం. గతంలో పవన్​కల్యాణ్​.. హరీశ్​ కాంబినేషన్​లో వచ్చిన గబ్బర్​ సింగ్​ బ్లాక్​బస్టర్​గా నిలిచింది.ఓ పవర్​ఫుల్​ కథను హరీశ్​ వినిపించగా.. పవన్​కల్యాణ్​కు నచ్చిందట. ఇందులో పవర్​స్టార్​ యాంగ్రీ యంగ్​మ్యాన్​ పాత్రను పోషించనున్నట్టు టాక్​. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు.

Read More

మిల్కీబ్యూటీకి బంపర్​ ఆఫర్​

ఒకప్పుడు స్టార్​ హీరోయిన్​గా వెలిగిన తమన్నా.. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు తమిళంలో ఓ బంపర్​ ఆఫర్​ వచ్చింది. మురగదాస్​ దర్శకత్వంలో ఇలళదళపతి విజయ్​ హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో హీరోయిన్​గా తమన్నా ఎంపికైంది. కొంతకాలంగా చిన్నహీరోలతో కూడా నటిస్తున్న తమన్నాకు ప్రస్తుతం ఈ భారీ ఆఫర్​ దక్కడంతో చాలా సంతోషంగా ఉందట. ఈ సినిమా హిట్​ అయితే తమన్నాకు మరిన్ని అవకాశాలు రావొచ్చని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక […]

Read More

ప్రణబ్​ ముఖర్జీ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్​ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్​ఫెక్షన్​ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్​ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్​ అధినేత్రి సోనియా, యువనేత […]

Read More

ప్రదీప్​ నిర్దోషి.. అదంతా డాలర్​బాబు​ డ్రామా!

సారథిమీడియా, హైదరాబాద్‌: దళితయువతిపై 139 మంది లైంగికదాడి కేసు రోజుకో మలుపుతిరుగుతున్నది. తాజాగా ఈ వివాదంపై ఎమ్మార్పీఎస్​ అధినేత మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసుతో యాంకర్​ ప్రదీప్​కు ఎటువంటి సంబంధం లేదని మందకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో బాధిత యువతితోకలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మందకృష్ణ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యాంకర్‌ ప్రదీప్ మాచిరాజు‌కు ఈ కేసుతో సంబంధం లేదు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై‌ బాధితురాలు కేసు పెట్టారు. […]

Read More

చిన్నారిపై గ్యాంగ్​రేప్​

త్రిపుర: ఓ వైపు కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలికలు, చిన్నారులపై లైంగికదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలోని తబారియా జిల్లాలో ఎనిమిదేండ్ల చిన్నారుపై ఏడుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం. తబారియా జిల్లాకు చెందిన ఓ బాలిక స్థానికంగా మూడో తరగతి చదువుతున్నది. ఆమె ఇంటిపక్కల ఉండే ఎనిమిది మంది బాలురు.. చిన్నారిని ఆడకొనేందుకు పిలిచారు. తెలిసినవాళ్లే కావడంతో చిన్నారి వాళ్లతో వెళ్లింది. దీంతో బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఏడుగురు లైంగకదాడికి […]

Read More

36 లక్షలు దాటిన కేసులు

  • August 31, 2020
  • Comments Off on 36 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా వ్యాప్తి భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గత 24 గంటల్లో 78,512 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,245కు చేరుకున్నది. కాగా ఇప్పటివరకు మొత్తం 64,469 మంది కరోనాబారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 27,74,801 మంది కరోనా నుంచి కోలుగోగా, 7,81,975 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

Read More