న్యూఢిల్లీ: ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పించడం, హక్కుదారుగా గుర్తించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వినిపించింది. తండ్రి జీవించి ఉన్నా.. లేకపోయినా ఆడపిల్లలకు మాత్రంలో ఆస్తిలో సమానహక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో వాటా ఉంటుందని, దానిపై హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.చట్టం ఏం చెబుతోందిహిందూ వారసత్వ చట్టం-1956లో సవరణలు చేశారు. సవరణలతో కూడిన చట్టాన్ని 2005 […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 60,963 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 56,110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కావడం ఊరట నిచ్చే అంశం. ఇప్పటివరకు 16,39,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 70.38 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 23,29,638 కి చేరుకున్నది. ఇప్పటివరకు 46,091మంది కోరోనా మృతిచెందగా.. 6,43,948 మంది వివిధ […]
విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నయనతార ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రియుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నయన్ దివ్యాంగురాలి పాత్రలో నటిస్తుందట. విఘ్నేష్ శివన్ కోసం ఈ పాత్రలో నటించడానికి నయన్ ఒప్పుకుందట. నయనతార ప్రస్తుతం ‘నేత్రికాన్’, ‘మూకుతి అమ్మన్’ సినిమాలతో పాటు రజనీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రంల్లో నటించాల్సి ఉంది. కరోనాతో వీటి షూటింగ్లు నిలిచిపోయాయి. కరోనా తగ్గాక కొత్తచిత్రాన్ని ప్రారంభిస్తారని తమిళమీడియా టాక్.
వాషింగ్టన్: భారతసంతతికి చెందిన ఓ మహిళ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికే ఆమె పోటీపడనున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్గా ఉన్న కమలా హారీస్ను డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్ష పదవి కోసం నెలరోజుల పాటు కసరత్తు చేసి.. చివరకు సరైన అభ్యర్థిని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. కమలా […]
బెంగళూరు: ఒక్క ఫేస్బుక్ పోస్టుతో బెంగళూరు నగరం అట్టుడికింది. తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సమీపబంధువు ఫేస్బుక్లో ఓ కులానికి చెందిన వారిని కించపరుస్తూ ఓ పోస్ట్పెట్టాడు. దీంతో ఆ కులానికి చెందినవారంతా భారీగా ఎమ్మెల్యే ఇంటివద్దరకు చేరుకొని ఆందోళనకు దిగారు. బెంగళూరులోని పులకేశి నగర్, భారతి నగర్, కమర్షియల్ స్ట్రీట్, టన్నెరీ రోడ్లో బలవంతంగా దుకాణాలను […]
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు ఉపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. కాగా సంజయ్ మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్నట్టు సమచారం. ఆయన ప్రస్తుతం కేజీఎఫ్ 2, శమ్షేరా తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సంజయ్ నటించిన కొన్ని వెబ్సీరిస్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.