సారథి న్యూస్, హైదరాబాద్: జోగిని స్వర్ణలత చెప్పిన రంగం భవిష్యవాణిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తీవ్ర హెచ్చరికలు చేశారు. మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరు చేసుకున్నదానికి వాళ్లు అనుభవించక తప్పదు కదా! అని అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమన్ని నిర్వహించారు. అమ్మవారు ఆవహించిన స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనాను కట్టడి చేయడానికి తాను ఉన్నానని.. భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయమని ఆజ్ఞాపించారు. […]
సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వైద్యాశాఖ ఉన్నతాధికారులకు తన రాజీనామా లెటర్ను పంపించారు. అయితే ఇటీవల జిల్లాకేంద్రంలో కరోనాతో మృతిచెందిన ఓ పేషెంట్ను ఎలాంటి భద్రతాచర్యలు పాటించకుండా ఆటోలో తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు మాత్రమే ధరించిన సిబ్బంది మాత్రమే అంబులెన్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో సకాలంలో సరైన వైద్యం అందక నలుగురు రోగులు మృతిచెందారు. ఈ వరుస ఘటనలపై పై […]
అధికారుల్లో కరోనా భయం సగం మందే విధులకు హాజరు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. సీఎం ఉండే ప్రగతిభవన్తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఉండే సెక్రటేరియట్, తాజాగా గవర్నర్ నివాస భవనం అయిన రాజ్భవన్లోకి కూడా ఈ వైరస్ ప్రవేశించింది. దీంతో చాలా మంది ప్రభుత్వ అధికారులు హోం క్వారంటైన్లో […]
మాస్కో: కరోనా టీకాపై గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. తామంటే, తాము వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రపంచంలోని పలుదేశాలు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రకటనలు గుప్పించాయి. కాగా తాజాగా రష్యా ఓ అడుగు ముందుకేసి.. తాము క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తిచేశామని.. అతి త్వరలోనే వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. రష్యాకు చెందిన సెచెనోవ్ మెడికల్ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్కు విజయవంతంగా ట్రయల్స్ పూర్తయ్యాయని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ తెలిపారు. రష్యాలోని గమాలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ […]
జైపూర్: రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడింది. ఓ వైపు డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పార్టీపై తిరుగుబాటు చేయగా.. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు రణ్దీప్ సూర్జేవాలా, అజయ్ మకెన్లు జైపూర్కు చేరుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అశోక్ గెహ్లాట్కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే సచిన్ పైలట్ వెంట ఎంతమంది ఉన్నారు.. అతడి వ్యూహం […]
ఇటీవల చాలామంది కిడ్నీసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, మూత్రం సరిగ్గా రాకపోవడం, తీవ్రమైన నొప్పితో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారు కొన్ని ఆరోగ్యచిట్కాలతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. సమస్య తీవ్రత అధికంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి అందుకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. మన రోజువారి డైట్లో కొన్ని ఆహారపదార్థాలను చేర్చుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలకు తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు. అవిఏమిటో ఇప్పుడు చూద్దాం.. కిడ్నీలో రాళ్లు ఎందుకొస్తాయిమూత్రపిండాలు మన […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు తీన్మార్మల్లన్నపై దాడిని ఖండిస్తున్నామని జైభీమ్యూత్ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలపై దాడి సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై తీన్మార్ మల్లన్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేనివారే దాడులకు పాల్పడుతారని విమర్శించారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇలాంటి అనైతిక పనులు మానుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. మల్లన్నపై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ కమాండెంట్ శ్రీహరిఓం ఖరే ఆధ్వర్యంలో ఆదివారం వెంకటాపురం మండలంలోని మంగవాయ, లక్మిపురం, పాత్రపురం గ్రామాల్లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. సీఆర్పీఎఫ్ఆఫీసర్ కమాండింగ్ ఎస్సై సీతారాం సింగ్, సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి, సీఆర్పీఎఫ్ఎస్సై అలెగ్జాండర్ డేవిడ్, ఎస్సై రాంప్రసాద్ పాల్ మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. సర్పంచ్ కృష్ణార్జునరావు, ఉపసర్పంచ్ మల్లికార్జున రావు, టీచర్ పాండా […]