న్యూఢిల్లీ: పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటూ సొంతపార్టీ కాంగ్రెస్ పైనే తిరుగుబాటు చేసిన రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు నిరాకరించారంట. తనను ఏడాదిలోపు సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారని, హామీ ఇచ్చే వరకు తాను భేటీ అయ్యేది లేదని తేల్చి చెప్పారని ప్రియాంకగాంధీకి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు. తనను సీఎంను చేస్తానని పబ్లిక్గా అనౌన్స్ చేయాలని పైలెట్ కోరారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి […]
ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు సెప్టెంబర్లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్ వేశారు. స్టూడెంట్స్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ‘కరోనా నేషనల్ డిజాస్టర్. […]
ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. బెడిసికొట్టింది.. ‘ఇక లాభంలేదు.. నా భార్య గురించి నాకే తెలుసు.. నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను’ అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. […]
నిర్మాత ఎంఎస్ రాజు ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి సంగతి తెలిసిందే. ఎంతోమంది హీరోలు.. హీరోయిన్లు.. టెక్నీషియన్లను ఆయన తెలుగు తెరకు పరిచయం చేశారు. అయితే ఆయన దర్శకుడిగానూ మారి తాజాగా తెరకెక్కించిన యూత్ ఫుల్ మోడ్రన్ ఏజ్ సినిమా ‘డర్టీ హరి’. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు యూత్ లో క్రేజీని పెంచాయి. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా కంటెంట్ ఉందని తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ మొదలైన దగ్గరినుంచి ఆద్యంతం వేడెక్కించే […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షిసిన్హా అంటే తెలియకున్నా ‘దబాంగ్’ హీరోయిన్ అంటే మాత్రం చాలా మంది గుర్తుపడతారు. అయితే సోనాక్షి ప్రధాన పాత్రలో నటించిన ‘భుజ్’ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ లుక్ తో హాట్ సోనాక్షి కాస్త ఐరెన్ లేడీగా చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, సంజయ్ దత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. […]
సారథి న్యూస్, జనగామ: టీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా ఆఫీసును పంచాయతీ రాజ్ శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పరిశీలించారు. నెలరోజుల్లో మూడు ఆఫీసులను మంత్రి కేటీఆర్చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. భూపాలపల్లి, హన్మకొండ(వరంగల్) పార్టీ ఆఫీసు పనులు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు. పనులు మరింత నాణ్యవంతంగా ఉండాలని సూచించారు.
డెహ్రాడూన్: కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. నాలుగు జిల్లాల్లో శని, ఆదివారాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్సింగ్ నగర్, నైనిటాల్లో లాక్డౌన్ కొనసాగనున్నది. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి, వ్యవసాయపనులకు, నిర్మాణరంగ పనులకు మినహాయింపు ఇచ్చారు. మద్యం దుకాణాలు, హోటల్లు తెరుచుకోవచ్చు. అయితే మిగతా ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ మూసేయాల్సిందే. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు […]
సారథి న్యూస్, హైదరాబాద్: వారంతా ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసే డాక్టర్లు.. ఆ వృత్తిలో వారంతా నిష్ణాతులు. రోగులు, చికిత్సలు, శస్త్రచికిత్సలతో క్షణం తీరిక లేకుండా గడిపే వైద్యులు. కరోనా కష్టకాలంలోనూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు ఆయువు పోస్తున్న సేవాతత్పరులు. కోవిడ్-19 రాష్ట్రంలో వ్యాపించినప్పటి నుంచి వంతుల వారీగా డ్యూటీలు చేస్తూ.. వైరస్ విజృంభణతో కుటుంబాలకు దూరంగా గడుపుతూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కార్యదీక్షులు. ఈ క్రమంలో కరోనాకు చికిత్సలు అందించే డాక్టర్లు అత్యంత […]