Breaking News

Month: July 2020

ఉద్యమకారులను అవమానించొద్దు

సారథిన్యూస్​, కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను అవమానించొద్దని భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్నీ) పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ఉద్యమకారుల స్థూపాన్ని శ్మశానవాటిక అయిన ప్రగతి మైదానంలో నిర్మించడమేమిటని ప్రశ్నించారు. పాత అమరవీరుల స్థూపం ఉన్నచోట కొత్త స్థూపాన్ని నిర్మించాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Read More
కరోనా మరణాల్లో భారత్​కు 7వ స్థానం

కరోనా మరణాల్లో భారత్​కు 7వ స్థానం

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 648 మంది చనిపోయారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 11,92,915కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 28,732 మంది చనిపోయారని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. దీంతో ప్రస్తుత లెక్కల ప్రకారం మరణాల్లో మన దేశం స్పెయిన్‌ని దాటేసింది. 7వ స్థానంలోకి వెళ్లింది. ఇప్పటి వరకు 28,400 మరణాలతో 7వ స్థానంలో ఉన్న స్పెయిన్‌ […]

Read More
కరోనా వ్యాక్సిన్ కోసం ఏ దేశంతోనైనా పనిచేస్తాం

కరోనా వ్యాక్సిన్ కోసం దేశంతోనైనా పనిచేస్తాం

వాషింగ్టన్‌: ప్రపంచంలో ఏ దేశమైనా కరోనా వ్యాక్సిన్​ను తయారుచేస్తే కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ స్పష్టంచేశారు. “ మాకు మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా వారితో కలిసి పనిచేస్తాం” అని ట్రంప్‌ అన్నారు. చైనాతో కలిసి పనిచేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని ట్రంప్‌ మొదటి […]

Read More
పేదలకు ఇళ్లు కట్టివ్వడమే లక్ష్యం

పేదలకు ఇళ్లు కట్టివ్వడమే లక్ష్యం

సారథి న్యూస్​, కర్నూలు: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారధి అన్నారు. 2021లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో ప్రధాని ఏపీకి 11 లక్షల ఇళ్లు కేటాయించారని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయాంలో అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో రూ.ఏడువేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. […]

Read More
సుప్రీం కోర్టుకు రాజస్థాన్​పంచాయితీ

సుప్రీం కోర్టుకు రాజస్థాన్​ పంచాయితీ

న్యూఢిల్లీ: పదిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌‌ సీపీ జోషి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. ‘నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్‌ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్‌‌కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ వేయాలని మా లాయర్‌‌ను కోరాను. హైకోర్టు […]

Read More
సచిన్‌ పైలెట్‌ ఫైర్‌‌

సచిన్‌ పైలెట్‌ ఫైర్‌‌

జైపూర్‌‌: అశోక్‌ గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు సచిన్‌పైలెట్‌ తమతో బేరాలు ఆడారని, డబ్బుల ఆశ చూపించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలపై సచిన్‌పైలెట్‌ సీరియస్‌ అయ్యారు. అనవసరంగా తనపై ఆరోపణ చేయొద్దని, ప్రతి ఒక్కరూ రూ.ఫైన్‌ కట్టి తనకు క్షమాపణలు పంపాలని నోటీసులు ఇచ్చారు. తన రాజకీయ మైలేజ్‌ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పైలెట్‌ ఆరోపించారు. గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు పైలెట్‌ కుట్ర పన్నుతున్నారని, అందుకే సాక్ష్యమని ఎమ్మెల్యే మలింగ […]

Read More

మావోయిస్టులూ.. విధ్వంసం ఆపండి

సారథిన్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులను, గిరిజనలకు తీరని అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ విమర్శించారు. జిల్లాలోని చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల మధ్య ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తుంటే మావోయిస్టులు రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను ధ్వంసం చేశారన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపాలని ఆయన సూచించారు.

Read More

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

సారథిన్యూస్​, ఓయూ: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఓయూ జేఏసీ నేతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఓయూ అరణ్యప్రాంతంలోని ఓ రహస్యప్రాంతంలో అమరణ దీక్ష చేపట్టారు. వీరి దీక్షను అడ్డుకొనేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఓయూ పరిసరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతావలయం ఏర్పాటుచేశారు. అయినప్పటికీ జేఏసీ నేతలు పోలీసుల కండ్లుగప్పి ఆందోళన నిర్వహించారు. ఓయూ జేఏసీ నేతల దీక్షకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్​ మానవతారాయ్​ సంఘీభావం తెలిపారు. దీక్ష […]

Read More