ఇండియన్2, పుష్ప చిత్రాల్లో తాను స్పెషల్సాంగ్స్ చేయడం లేదని ఆర్ఎక్స్100 ఫేమ్ పాయల్ రాజ్పుత్ స్పష్టం చేశారు. తాను ఆ రెండు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానంటూ కొందరు పుకార్లు పుట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రస్తుతం నేను కొన్ని కథలు వింటున్నాను. కథ నచ్చితే సినిమా చేస్తాను. ఆ విషయాన్ని స్వయంగా నేనే ప్రకటిస్తాను. కాబట్టి అప్పటివరకు నా మీద అనవసర పుకార్లు పుట్టించి మీ సమయం వృథా […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో రామ్చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ ఈ చిత్రంలో మాజీ నక్సలైట్గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం లాక్డౌన్తో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆచార్యలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తున్నది. త్వరలో ఫిల్మ్సిటీలో మొదలయ్యే షూటింగ్లో ఆమె పాల్గొననున్నది. రెజీనా ఓ […]
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్స్టోరీ’ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్సిటీలో జరుగనున్నది. ఫిదా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని శేఖర్కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అగష్టు మొదటివారం నుంచి రామోజీఫిల్మ్సిటీలో షూటింగ్ జరుగనున్నట్టు సమాచారం. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నది.
ఆర్జీవీ శిష్యుడు, మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీలో ప్రకంపనలు సృష్టించిన అజయ్ భూపతి కొత్త చిత్రం మహాసముద్రంలో యువనటుడు శర్వానంద్ హీరోగా చాన్స్ కొట్టేశాడు. మహాసముద్రం స్ర్కిప్ట్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోతూ వస్తున్నది. తాజాగా శర్వానంద్ ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కాగా హీరోయిన్గా రాశీఖన్నా ఎంపికైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, […]
సారథి న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఇందారం ఓపెన్ కాస్ట్ ఓబీ కంపెనీలో విధినిర్వహణలో ఉండగా చనిపోయిన కార్మికుడి కుటుంబానికు రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కడారి సునీల్, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో సర్వే అధికారుల పనులను జనరల్ క్యాటగిరి కాంట్రాక్టు కార్మికులతో పని చేయడం మూలంగా కార్మికుడు చనిపోయాడని ఆరోపించారు. కార్యక్రమంలో […]
సారథిన్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి మాట్లాడుతూ.. కరోనా, లాక్డౌన్తో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అందుకే వారికి తమవంతుగా ఈ సాయం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ ప్రధాన కార్యదర్శి భిక్షపతి, కోశాధికారి గుండా రాజు, సభ్యులు శరత్ బాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, భేణిగోపాల్ త్రివేది, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వం కొనుగోలు చేసిన యంత్రాలను అధికారులు నిరుపయోగంగా పడేశారని కాంగ్రెస్ నేత అక్కు శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పనుల్లోని మోటర్లకు ఉపయోగించేందుకు స్విచ్చింగ్ యంత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయగా వాటిని అధికారులు హుస్నాబాద్లోని నివాసప్రాంతాల్లో ఉంచారని ఆరోపించారు. వాటిని వెంటనే వినియోగించాలని.. లేదంటే కంపెనీలకు వాపస్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని […]
తెలుగమ్మాయి అంజలి నటించిన బెలూన్ చిత్రాన్ని ఓటీటీలోనే రీలీజ్ చేయనున్నారు. అంజలి తెలుగులో అడపదడపా సినిమాల్లో నటించనప్పటికీ తమిళంలోనే బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బెలూన్ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కామెడీ, హారర్గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. జీ5లో […]