Breaking News

Day: July 19, 2020

పేదలబియ్యం పక్కదారి

సారథిన్యూస్​, కోడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని దారిమళ్లించి సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ రేషన్​డీలర్​ భర్తను పోలీసులు అరెస్ట్​ చేశారు. కోడేరు మండల కేంద్రంలోని రేషన్​షాప్​నెంబర్​ 3 డీలర్​ శారద భర్త శ్రీనివాసులు 95 కిలోల బియ్యాన్ని దారి మళ్లించాడు. కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై పౌరసరఫరాల సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశామని డీలర్ ను అదుపులోకి తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు తెలిపారు.

Read More
‘గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దిగిపో’

‘గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దిగిపో’

జైపూర్‌‌: రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభంపై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆడియోలో ఉన్న గొంతు అతనిదే అని కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ఐదు ప్రశ్నలు సందించారు. ‘గజేంద్ర సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌‌ నమోదైంది. తన గురించి తెలిసిన వాళ్లే అది ఆయన వాయిస్‌ అని గుర్తుపట్టారు. అలాంటిది ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారు? […]

Read More
గెహ్లాట్‌కు బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు

గెహ్లాట్‌కు బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు

జైపూర్‌‌: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌తో పాటు 18 మందికాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం పడిపోయిన విషయం తెలిసిందే. వచ్చేవారం బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం అశోక్‌ గెహ్లాట్‌ గవర్నర్‌‌ను కలిశారని తెలుస్తోంది. బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశోక్‌ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వడంతో గెహ్లాట్‌ గవర్నర్‌‌ను కలిశారని చెప్పారు. సీఎం గెహ్లాట్‌ నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీ సందర్భంగా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఇస్తున్నట్లు […]

Read More
‘కరోనా’ ట్రయల్స్‌కు మీరు రెడీనా?

‘కరోనా’ ట్రయల్స్‌కు మీరు రెడీనా?

న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు వలంటీర్లు కావాలని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రకటించింది. సోమవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ చేసేందుకు పర్మిషన్‌ వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవాలని చెప్పింది. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఎయిస్‌ ఎథిక్స్‌ కమిటీ ఒప్పుకోవడంతో ఈ ప్రకటన రిలీజ్‌ చేశారు. మొదటి ఫేజ్‌లో 375 మందిపై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగించాల్సి ఉండగా, […]

Read More
చైనాను దెబ్బకొట్టేందుకు ఇలా

చైనాను దెబ్బకొట్టేందుకు ఇలా

న్యూఢిల్లీ: చైనాను దెబ్బతీసేందుకు మన సైన్యం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు ఇండో టిబెటన్‌ బోర్డర్‌‌ పోలీస్‌(ఐటీబీపీ) కొత్త భాషను నేర్చుకుంటుంది. ఐటీబీపీలోని 90వేల మంది చైనాలో ఎక్కువగా మాట్లాడే మాండరిన్‌ భాష నేర్చుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేక కోర్సును డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. లద్దాఖ్‌లో ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో ఐటీబీపీ తమ జవాన్ల కోసం మాండరిన్‌ కోర్సును నేర్పిస్తున్నారు. మన సైనికులు మాండరిన్‌ భాషను నేర్చుకుంటే చైనా సైనికులతో నేరుగా మాట్లాడేందుకు వీలుంటుందని, […]

Read More
నాగర్​కర్నూల్​లో విస్తరిస్తున్న కరోనా

నాగర్​కర్నూల్​ జిల్లాలో 13 కొత్తకేసులు

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లాలో కరోనా అంతకంతకూ విస్తరిస్తున్నది. తాజాగా 13 కొత్తకేసులు నమోదైనట్టు డీఎంహెచ్​వో సుధాకర్​ లాల్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ పట్టణంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన విలేకరి సోదరికి, అతని కోడలుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. నాగర్​కర్నూల్​ మండలం పెద్దాపూర్​కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్​లోని ఓ దవాఖానలో డయాలసిస్​ చేయించుకుంటున్నది. తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. అచ్చంపేట పట్టణంలో నలుగురికి, బల్మూర్ మండలం […]

Read More

మావోయిస్టుల పేరుతో బెదిరింపు

సారథిన్యూస్​, ఖమ్మం: మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ఓ ముఠాగా ఏర్పడి మావోయిస్టుల మంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్​ హెచ్​ఆర్​ మేనేజర్​కు ఫోన్​చేసి డబ్బులు డిమాండ్​ చేశారు. దీంతో మేనేజర్​ వారికి డబ్బులు ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సదురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read More

మమ్మల్ని ఆదుకోండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులందరికీ స్పెషల్​ ఇన్సెంటివ్​, ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలని యూనియన్​ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, రీజియన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు శనిగరపు చంద్రశేఖర్, ఏఐటీయూసీ సింగరేణి ఏరియా ఆసుపత్రి విభాగం ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, […]

Read More