Breaking News

Day: July 19, 2020

కోలీవుడ్ కు కియారా

కోలీవుడ్ కు కియారా

‘ఫగ్లీ’మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ‘ఎమ్ఎస్ ధోని’ మూవీతో అక్కడ, ‘భరత్ అను నేను’తో తెలుగునాట మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్​గా ‘కబీర్ సింగ్’తో మరింత స్టార్ డమ్ మూటగట్టుకుంది. దాంతో కియారా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ లో తన అందాలతో కిక్ ఎక్కించిన కియారా ఇప్పుడు కోలీవుడ్ లో అడుగుపెట్టనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అందులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశం అందిబుచ్చుకుందని ప్రచారం […]

Read More
శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జలాశాయానికి మరింత వరద వచ్చింది. ఈ సీజన్‌లో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 3 టర్బయిన్ల ద్వారా 0.474 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్​ఉత్పత్తిని ప్రారంభించలేదు. శ్రీశైలలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 77,534 క్యూసెక్కులు కొనసాగుతోంది. రిజర్వాయర్​పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, […]

Read More
పోలీస్ స్టేషన్​కు అలీ

పోలీస్ స్టేషన్​కు అలీ

టాలీవుడ్ ప్రఖ్యాత కామెడీ నటుడైన అలీ కొద్దిరోజులుగా ఫేస్​బుక్, ట్విట్టర్​లో తాను పెట్టని కమెంట్ల గురించి ఆశ్చర్యంలో ఉన్నారు. అందరూ ఆ ట్విట్టర్ అలీదే అనుకున్నారట కూడా. వాటి వల్ల తను ఇబ్బందులకు గురవుతున్నాడట. ‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం, గుణం, వర్ణం గురించి మాట్లాడతారు.. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వు నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు..’ అని అలీ పేరుతో ఓ ట్వీట్ రాగా.. దానికి ప్రతిగా ప‌వ‌న్ […]

Read More
తెలంగాణలో 1,296 కేసులు

తెలంగాణలో 1,296 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 1,296 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తంగా 45,076 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. రికవరీ అయిన వారి సంఖ్య 30,607కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇలా ఇప్పటివరకు 409 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ పరిధిలో 557 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా 111, మేడ్చల్​87, సంగారెడ్డి 28, కామారెడ్డి 67, వరంగల్​ అర్బన్​117, […]

Read More
కర్నూలును కరోనా క్యాపిటల్‌గా మార్చారు

కర్నూలును కరోనా క్యాపిటల్‌గా మార్చారు

సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ ముఖద్వారమైన కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కరోనా క్యాపిటల్‌గా మార్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్​ఎద్దేవా చేశారు. గ్రామాల్లో సచివాలయాలతో వికేంద్రీకరణ చేసినట్లు ప్రాంతీయ కోవిడ్‌ ఆస్పత్రులుగా ఏర్పాటుచేస్తే బాగుంటుందన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రిగా కర్నూలు సర్వజన ఆస్పత్రిని మార్చారని, నగరం నడిబొడ్డున ఆస్పత్రి ఉన్నందున వైరస్‌ ప్రజకు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. కోవిడ్‌ ప్రాంతీయ […]

Read More
పోలీసులకు హెల్త్​కిట్​

పోలీసులకు హెల్త్​కిట్​

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా బారినపడిన 44 మంది పోలీస్​కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి హెల్త్​కిట్లు ఆదివారం పంపిణీ చేశారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇలాంటి హెల్త్ కిట్స్ పంపిణీ చేసిన ఎస్పీకి పోలీసులు, వారి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పోషకాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా నుంచి త్వరగా కోలుకోవచ్చన్నారు. మనం తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలని ఎస్పీ సూచించారు.

Read More
సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

అన్నివర్గాలకు సంక్షేమఫలాలు

సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్​ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంర్​ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, మాజీ ఎంపీపీ మారుకొండ కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు […]

Read More

రైజింగ్ సన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్

సారథిన్యూస్, రామడుగు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని యువజన సంఘం సభ్యులు చెప్పారు. ఆదివారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట శివారులో రైజింగ్​ సన్​ యువజనసంఘం సభ్యులు స్వచ్ఛ భారత్​ నిర్వహించారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తా, చెదారం తొలిగించారు. కార్యక్రమంలో రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు గజ్జెల అశోక్, ప్రధాన కార్యదర్శి జేరిపోతుల మహేశ్​, గజ్జెల నవీన్, ప్రశాంత్, రాజు కుమార్ పాల్గొన్నారు.

Read More