న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్ఎన్ […]
సామాజిక సారథి, జడ్చర్ల: మండలంలో ఇటుక బట్టీల యజమానితో చిత్రహింసలకు గురవుతున్నారని ఒడిశా వలస కూలీల ఘటనపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దేవుడి గుట్ట సమీపంలో ఇరవైరోజుల క్రితం మాధవరావు అనే కాంట్రాక్టర్ ఇటుక బట్టీలను తయారు చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి ఓ మధ్యవర్తి ద్వారా సుమారు 13మంది వలస కూలీలను తీసుకొచ్చారు. ఓ వలసకూలీ తమను ఇటుక […]
ఏలూరు టౌన్: రోడ్డు ప్రమాదం నవదంపతులను బలిగొన్నది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన యడ్లపల్లి వెంకటేష్కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడకు చెందిన ఆలపాటి మానస నవ్యతో ఈ నెల 14న రాత్రి గోవాడలో వివాహం జరిగింది. వివాహం అనంతరం గురువారం వధువు సోదరుడు భరత్తో కలిసి నవ దంపతులు […]