రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును 10వరకు నిలిపివేయాలి పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రతపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను […]
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్ఎన్ […]
మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు ఆస్తుల పంపకాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంతో కాలయాపన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సమాజంలో విశ్వసనీయత కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చివరి ప్రత్యామ్నాయంగా కోర్టు తలుపులు తట్టాలని సూచించారు. శనివారం […]