Breaking News

VAJEDU

తెలంగాణ పద్మశాలి అసోసియేషన్ కమిటీ ఎన్నిక

పద్మశాలి అసోసియేషన్ కమిటీ ఎన్నిక

సారథి న్యూస్, ములుగు: తెలంగాణ పద్మశాలి అఫీషియల్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్(పొపా) నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ రాజ్ సమక్షంలో మంగళవారం ఎన్నుకున్నారు. ములుగు జిల్లా పొపా కమిటీ అధ్యక్షుడిగా ఏళ్ల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా చుంచు రమేష్, కోశాధికారిగా ఆడపు రాజు, ఉపాధ్యక్షుడిగా మెరుగు రమేష్, రాంచందర్, సహాయ కార్యదర్శిగా తాళ్ల విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా గజ్జెల సుమన్ ను ఎన్నకున్నారు. ములుగు జిల్లాలోని పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషిచేస్తానని చెప్పారు. తన […]

Read More
మాకు ప్రశ్నించే హక్కు లేదా?

మాకు ప్రశ్నించే అధికారం లేదా?

సారథి న్యూస్, వాజేడు: ‘నాకు ప్రశ్నించే అధికారం లేదా..? నేను ఓ ప్రజాప్రతినిధిని కాదా?, కనీసం నాకు విలువ లేదా?’ అని కన్నీరుమున్నీరయ్యారు ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శ్యామల శారద. మంగళవారం ఆమె జడ్పీటీసీ సభ్యురాలు తల్లడి పుష్పలతతో కలిసి స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్ పై విమర్శలు గుప్పించారు. పల్లెల్లో జరిగే పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తే తమను […]

Read More
ప్రకృతి వనాలతో మానసిక ఉల్లాసం

ప్రకృతి వనాలతో మానసిక ఉల్లాసం

సారథి న్యూస్​, వాజేడు, ములుగు: యాంత్రిక జీవన విధానంలో అలసిపోతున్న ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు పల్లె ప్రకృతివనాలు ఎంతో దోహదపడతాయని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని కలెక్టర్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క)తో కలిసి ప్రారంభించారు. అన్ని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు తుదిదశకు చేరాయని వివరించారు. సేదదీరడానికి ఏర్పాటుచేసిన బెంచిలో కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు కాసేపు కూర్చుని […]

Read More
మావోయిస్టు పార్టీ ఇన్​ఫార్మర్ల అరెస్ట్​

మావోయిస్టు పార్టీ ఇన్​ఫార్మర్ల అరెస్ట్​

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో 17మంది ఇన్​ఫార్మర్లను సోమవారం పోలీసులు అరెస్ట్ ​చేశారు. వీరంతా మావోయిస్టు అగ్రనేతలు హరిభుషణ్, దామోదర్, రాజిరెడ్డి, మైలరపు అడేల్లును కలిసేందుకు చత్తీస్​గఢ్​కు వెళ్లి వారికి కావాల్సిన విప్లవ సాహిత్యాన్ని సమకూర్చేందుకు వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అరెస్ట్​ అయినవారిలో డబ్బకట్ల సుమన్, చందా మహేష్, తాటిపాముల రమేష్, చిడం జంగుదేవ్, రమణ, గంట సత్యం, కుడిమెట్ల శ్రీనివాస్, మెంతని […]

Read More
భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ

భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఈజీ

సారథి న్యూస్, వాజేడు, ములుగు: జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. మీసేవా, ధరణి ద్వారా ప్రజలకు పారదర్శకంగా భూసంబంధిత సేవలు అందిస్తామన్నారు. జిల్లాలో 47 మీసేవా సెంటర్లు, 60 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలు అందించనున్నట్లు వివరించారు. మీ సేవా సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయించిన […]

Read More
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరోనా కారణంగా 9 రోజులుగా సంబరాలు అంతంత మాత్రంగానే జరుపుకున్నా, చివరిరోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకల్లో పాల్గొన్నారు. ఏ పల్లెలో చూసినా సంబరాల ఉత్సాహమే కనిపించింది. డీజే పాటలు, డోలు వాయిద్యాలతో సందడిగా కనిపించింది. మహిళలంతా బతుకమ్మను పోయిరా.. గౌరమ్మా పోయిరా.. అంటూ సాగనంపారు.

Read More
నిరుపేద యువతికి సాయం

నిరుపేద యువతికి సాయం

సారథి న్యూస్, ములుగు: ఓ నిరుపేద యువతికి మహిళా అధికారి సాయం అందించారు. తిండిలేక అల్లాడిపోతున్న యువతి మంగళవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన సబ్​రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్ ​రూ.మూడువేలు, 25కేజీల బియ్యం అందజేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మురారి సుధాకర్, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారింది. తండ్రి పిల్లలను పట్టించుకోకపోవడంతో […]

Read More
ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి

ఏజెన్సీలో నూతన రెవెన్యూ చట్టాన్ని నిలిపేయాలి

సారథి న్యూస్, వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల మీద అత్యంత పాశవికంగా దమనకాండ కొనసాగిస్తోందని ఆదివాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు పూనేం సాయి విమర్శించారు.ఏజెన్సీ నూతన రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్​ఎస్​ను నిలిపివేయకపోతే ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, తమ పదవులకు రాజీనామా చేయాలని సాయి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 1970కు ముందు ఉన్న గిరిజనేతరులందరికీ భూములపై […]

Read More