సారథి, వేములవాడ: టీపీసీసీ చీఫ్ఎనుముల రేవంత్ రెడ్డి తలపెట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కాంగ్రెస్మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా నేతృత్వంలో తరలివెళ్తున్న వారిని శుక్రవారం కోనరావుపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ.. పోలీసుల పహారాలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిరోజులు రాజ్యమేలుతారో చూద్దామని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఎంత మందిని నిర్బంధించినా ప్రజల కోసం కాంగ్రెస్ నిరంతర పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. […]
సారథి, పెద్దశంకరంపేట/గొల్లపల్లి/రామడుగు: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి మెదక్జిల్లా పెద్దశంకరంపేట మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమానికి తరలిన వారిలో రాయిని మధు, జనార్ధన్, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, నారాగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజునాయక్, సాయిరెడ్డి, రఘుపతిరెడ్డి, రాంచందర్, […]
సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు సారథి, జగిత్యాల: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించాలని, నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. […]
సారథి, వేములవాడ: ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవగా చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు. కొవిడ్ బాధితులకు రెమిడెసివిర్ఇంజక్షన్లు, అక్సిజన్అందించడంలో, ఆస్పత్రుల్లో బెడ్లు సమకూర్చడంలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చిలకల […]
సారథి, ములుగు: ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నిస్తుందన్నారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ వారిని […]
సారథి న్యూస్, హైదరాబాద్: పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్చేశారు. ధరలు తగ్గే వరకు పేదల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. చదువుకున్న మేథావులంతా పెరుగుతున్న ధరలపై ఆలోచన చేయాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాంపల్లి గృహకల్ప వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే సీతక్క, అధికార […]
సారథి న్యూస్, కల్వకుర్తి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నాలుగవ రోజు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చేరింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. శ్రీశైలం, జూరాల, పులిచింతల, శ్రీరాంసాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ ప్రధాన […]
భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్ పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్ భవన్ ’ ఉద్రిక్తంగా మారింది. భట్టి విక్రమార్క, ఇతర […]