తెలంగాణ బీసీ కమిషన్ పై కర్ణాటక ప్రశంసలు త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల కమిషన్ల సమావేశం చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు వెల్లడి సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బీసీ కమిషన్ పనితీరును కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాష్ ప్రశంసించారు. దేశానికి తెలంగాణ బీసీ కమిషన్మార్గదర్శిగా నిలిచిందని, నియామకమైన మూడు నెలల్లోనే అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ […]
ఇంటింటికీ బీఎస్పీ.. గడపగడపకు ఏనుగు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ‘సామాజిక సారథి’తో చిట్చాట్ సామాజిక సారథి, నాగర్కర్నూల్ ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్సమాజ్పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్కర్నూల్జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ […]
సామాజిక సారథి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్న విషయం తెలిసిందే. నీవంటే నీవే అంటూ వేలెత్తిచూపుకుంటున్నాయి. యాసంగి సంగతి అటుంచింతే వానాకాలంలో చేతికొచ్చిన ధాన్యం కొనే దిక్కులేదు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు మొలకెత్తడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకునే దిక్కు ఎవరని గగ్గోలుపెడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కేంద్రం వద్దంటే యాసంగిలో ధాన్యం కొనలేమని […]
విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు ఉంటే ఓకే పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా చూడండి కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శించండి అధికారులతో సీఎస్సోమేశ్కుమార్ సామాజిక సారథి, హైదరాబాద్: పారాబాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ నిర్ణయించిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలు చేసుకునేవారు సొంత రిస్క్తో వరిసాగు చేసుకోవచ్చని చెప్పారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా అగ్రికల్చర్, సివిల్సప్లయీస్ […]
డాక్టర్బీఆర్అంబేద్కర్ అద్భుతమైన రచన చేశారు కరోనా వ్యాక్సిన్ అందరూ తీసుకోవాల్సిందే రాజ్భవన్ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళసై సామాజిక సారథి, హైదరాబాద్: రాజ్యాంగం వల్లే భారత్బలంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
సామాజిక సారథి, హైదరాబాద్ప్రతినిధి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఐదు జిల్లాల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, […]
సామాజిక సారథి, సిద్దిపేట: అన్నదాతలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా నిలిచారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లిలో రైతులతో ఆయన మాట్లాడారు. వానకు తడవగా.. ఎండబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాలవర్షాలతో ధాన్యం తడిసి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు […]
సందిగ్ధంలో భారీ ఎత్తిపోతల పథకం ప్రారంభం నుంచీ ప్రాజెక్టుకు అవాంతరాలే తాజాగా పర్యావరణ అనుమతులు లేవని ట్రిబ్యునల్స్టే నీటి కేటాయింపుల్లేవు.. ప్రాజెక్టుకు అనుమతుల్లేవు నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వపెద్దలు ఇదీ ‘పాలమూరు’ స్వరూపంప్రారంభ అంచనా వ్యయం: రూ.50వేల కోట్లుపెరిగిన అంచనా వ్యయం: రూ.లక్ష కోట్లుసాగునీటి అంచనా: 10లక్షల ఎకరాలుపంపులు: 5పొడవు: 1000 కి.మీ.ఇప్పటివరకు ఖర్చు: రూ.50వేల కోట్లు -గంగు ప్రకాశ్, ప్రత్యేక ప్రతినిధి, సామాజిక సారథి కరువు ఛాయలు అలుముకున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణాజలాలను పారించి […]