సారథి న్యూస్, బెజ్జంకి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల పేర్కొన్నారు. గురువారం బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఆమె తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత, మార్కెట్ కమిటి చైర్మన్ పోచయ్య, సర్పంచ్ సీతా లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూమయ్య, ఎంపీటీసీ మల్లేశంగౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, సిద్దిపేట/ఖమ్మం: హైదరాబాద్కే పరిమితమైందనుకున్న కరోనా క్రమంగా జిల్లాలకూ విస్తరిస్తున్నది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అందులో ఒకరు పరారీలో ఉన్నాడు. మరొకరు హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్సపొందుతున్నట్టు సమాచారం. వారిద్దరూ హైదరాబాద్లోని ఓ మార్కెట్లో పనిచేస్తున్నారని తెలిసింది. మరోవైపు ఖమ్మం జిల్లా తల్లాడ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. తహసీల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీంద్ర రెడ్డి, […]
సారథి న్యూస్, మెదక్: కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి, రామాయంపేట ప్రాంతాల్లో కాల్వ పనులను తొందరగా పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోమటిబండపై మిషన్ భగీరథ భవన్ లో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వేణుతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణకు […]
సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట ఒడిలో గోదారమ్మ జలసవ్వడి చేసింది. చంద్లాపూర్ వద్ద రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మోటార్ ను ఆన్ చేసి రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. తొలుత చంద్లాపూర్లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్హౌస్ వద్ద పంప్ను ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే వ్యవస్థ వద్ద మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, కలెక్టర్ […]