సారథిన్యూస్, రామడుగు: రామడుగు మండల కేంద్రంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని గ్రామ యువకులు.. కార్యదర్శి జ్యోతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సులభ్ కాంప్లెక్స్ లేకపోవడంతో వివిధ గ్రామాల నుంచి రామడుగు మండల కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అనుపురం పరుశరాం, పురేళ్ల శ్రీకాంత్, మామిడి అంజి, ఉత్తేమ్, మహేశ్ తదితరులు ఉన్నారు.
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 9 పంచాయతీ కార్యదర్శి పోస్టులు(రెగ్యులర్, జూనియర్) తాత్కాలిక ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ నుంచి ఎంపిక చేసేందుకు ధ్రువీకరణ పత్రాలను ఈనెల 6న ఉదయం10.30 గంటలకు జిల్లా పంచాయతీ ఆఫీసులో పరిశీలిస్తామని కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఈ మేరకు మెరిట్ లిస్టును 1:3 నిష్పత్తిలో జిల్లా పంచాయతీ ఆఫీసులో నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.