సారథి న్యూస్, బిజినేపల్లి: స్థానికంగా సరైన వసతులు లేవనే కారణంతో వనపర్తి, షాద్నగర్ లో కొనసాగుతున్న బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలుర పాఠశాల, నాగర్ కర్నూల్ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీని ఇదివరకు ఉన్న ప్రదేశాల్లోనే కొనసాగించాలని సీఎం కె.చంద్రశేఖర్రావు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంవో సెక్రటరీ కె.భూపాల్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులకు సరిపడా గదులు, వసతి సౌకర్యం లేదని గతేడాది బిజినేపల్లి స్కూలును వనపర్తికి, నాగర్కర్నూల్ […]
సారథి న్యూస్, పరిగి: స్వేరోస్ ప్రతిజ్క్ష దివస్ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిగి 5కే రన్ కార్యక్రమం విజయవంతమైంది. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ స్వేరో జెండాను ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు సి.కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల అదనపు క్రీడాధికారి డాక్టర్ సోలపోగుల స్వాములు స్వేరో, సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ రుద్రవరం సునీల్ స్వేరొ, ప్రతిజ్ఞ దివస్ కన్వీనర్ ఏపీ శేఖర్, […]
సారథి న్యూస్, హైదరాబాద్: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన (బీసీ) సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలోని గురుకుల కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 వరకు ఉన్న గడువును 19 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో బాలబాలికలకు, మహిళా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్లో అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీగా పదోన్నతి పొందిన సందర్భంగా గురుకులాల స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘జ్ఞానసమాజ నిర్మాణంలో మీ కృషి చాలా గొప్పది. మీరు మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలి.. జ్ఞానసమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఇంటిలో జ్ఞానజ్యోతులు వెలిగిద్దాం. మీ కలలను సాకారం చేస్తాం’ అని స్వాములు అన్నారు. ఆయన వెంట […]
సారథి న్యూస్, వనపర్తి: చదువు ద్వారానే దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమరచింత విజయ్ కుటుంబాన్ని మంగళవారం కలిశారు. అణగారిన బతుకుల్లో వెలుగులు నింపేందుకు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృషిచేస్తున్నారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలని పిలుపునిచ్చారు. స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, సాయిబాబా, కురుమూర్తి, […]