సామాజిక సారథి, రామడుగు: హెల్మెట్ ధరించి బైక్ నడపాలని బ్లూకోట్ పోలీసులు గురువారం పలువురికి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని, డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదని సూచించారు. రామడుగు ప్రధాన కూడళ్లలో గ్రామస్తులు, వాహనదారులకు అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల పంచాయతీకి సోమవారం బీజేపీ నాయకులు భారతమాత చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ చిత్రపటాలను బహూకరిస్తున్నట్లు తెలిపారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజ, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, బీజేపీ నాయకులు కట్ట రవీందర్, ముడుగంటి శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ యువకులను ఎక్కువగా బలి తీసుకుంటోంది. తాజాగా కరీంనగర్జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన నీలం రాజు (34) అనే యువకుడు కరోనాతో మృతిచెందాడు. కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతుడికి అమ్మ నాన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. తాను పెళ్లి చేసుకోకుండా కుటుంబభారాన్ని మోస్తున్నాడు. తమ కొడుకు లేడన్న నిజాన్ని తెలుసుకుని రాజు తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తుండగా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. నీలం రాజు […]
సారథి, రామడుగు: మండలంలోని దేశరాజుపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి –మనోహరాబాద్ రైల్వే లైన్ భూ బాధితులకు న్యాయం చేయాలని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు వంచ మహేందర్ రెడ్డి గ్రామ భునిర్వాసితులతో కలసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో పెద్దపల్లి –నిజామాబాద్ రైల్వే లైన్ లో భూములు, ఇండ్లను కోల్పోయి ఆ రైల్వే లైన్ పక్కనే భూమి కొనుగోలుచేసి నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మళ్లీ […]
సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ఇటీవల కాంగ్రెస్ బీసీ సెల్ కరీంనగర్ జిల్లా చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సన్మానించారు. యూత్ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థి నేతగా, యువజన నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 20 ఏళ్లపాటు చేసిన కృషికి పార్టీ అధిష్టానం ఈ పదవి కట్టబెట్టిందన్నారు. కార్యక్రమంలో వెలిచాల మాజీ సర్పంచ్ […]
సారథి న్యూస్, రామడుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కనిపించడం లేదని బుధవారం రామడుగు పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదుచేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యత కలిగిన హోదాలో ఉండి కూడా ప్రజాసమస్యలను గాలికొదిలేసి తిరుగుతున్నారని ఆరోపించారు. వరి ధాన్యం తూకాల్లో మోసాలు చేస్తున్నా ఒక్కరోజైనా మంత్రి గంగుల కమలాకర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పాపానపోలేదని అన్నారు. మరో మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ కే పరిమితమయ్యారని […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మాజీ ఎంపీపీ తడగొండ అంజలి మామ తడగొండ పోచమల్లు ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఆర్.వివేకానంద సోమవారం పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, ఎంపీటీసీ మోడీ రవీందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, మాజీ ఎంపీటీసీ పెంచాల మల్లారెడ్డి ఉన్నారు.