సారథి న్యూస్, కర్నూలు: కరోనా బారినపడి చనిపోయిన వారిని అంబులెన్స్లో తరలించేందుకు వీలుగా సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టోల్ఫ్రీ నంబర్ను శుక్రవారం ప్రారంభించారు. ఎవరైన చనిపోతే తరలించేందుకు 9440879791 నంబర్కు ఫోన్ చేసి ఉచిత సహాయం పొందవచ్చని కోరారు. ఇన్చార్జ్ మెహబూబ్ అందుబాటులో ఉంటారని ప్రకటించారు.
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నగరంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నీటి సమస్య తలెత్తకుండా రెండవ సమ్మర్ స్టోరేజీ […]
సారథి న్యూస్, కర్నూలు: పాత కార్మికులను తొలగించి వారి స్థానంలో డబ్బు వసూలు చేసి కొత్త వారిని నియమించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆరోపణలు చేసే వారు దమ్ముంటే నిరూపించాలని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు తమ పార్టీ నాయకులే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం కార్మికుల జీవితాలతో ఆటలాడడం సరికాదన్నారు. ప్రతి కార్మికుడికి అండగా ఉండి సేవచేస్తానని, వీలైనంత సాయం చేస్తానే […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తోంది. ఆ పేరు చెబితేనే అందరూ ఉలిక్కిపడే పరిస్థితి. కరోనాతో చనిపోయారని వింటేనే చాలు .. రక్తపంచుకు పుట్టినవారు, ఆప్తులు, బంధువులు, నా.. అనే వారు ఎవరూ ముందుకురావడం లేదు. కానీ ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా.. అందరిలోనూ ధైర్యం నింపేలా.. కరోనా భూతంపై అవగాహన కల్పించేలా ముందుకొచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఆయన ఎవరో కాదు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్. కోవిడ్ బారినపడి మృతిచెందిన ఓ […]
సారథి న్యూస్, కర్నూలు: జొహరాపురం బ్రిడ్జి పనులను ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులతో కలిసి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గురువారం పరిశీలించారు. రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.3.3 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని వివరించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ఆదేశించారు.
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. న్యాయ రాజధాని ద్వారా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి కటిక గౌతమ్, భాను ప్రకాశ్, ఖయూమ్, సాయికృష్ణారెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, అసిఫ్ […]