సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్ లో నిర్వహించిన స్వేరోస్ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట […]
సారథి న్యూస్, అలంపూర్: అలంపూర్ పట్టణంలో జనవరి 13,14 తేదీల్లో నిర్వహించబోయే స్వేరోస్ సంబరాలకు రావాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను ఆహ్వానించినట్లు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, సీనియర్ స్వేరో ఎంసీ కేశవరావు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేతులమీదుగా ఆవిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ఆర్.నాగరాజు, ఆర్.సునీల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
‘జగనన్న విద్యాకానుక’తో విద్యార్థులకు భరోసా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించండి కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల బంగారు భవిష్యత్కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ అన్నారు. గురువారం నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్, ఏ క్యాంప్ గవర్నమెంట్ స్కూల్, బీ క్యాంప్ బాలబాలికల స్కూలు, మున్సిపల్ ప్రైమరీ స్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ […]
సారథి న్యూస్, కర్నూలు: నూతనంగా ఎన్నికైన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ అధ్యక్షురాలు కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి గారి రాఘవేంద్రారెడ్డి, సభ్యులు సాంబశివారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహబూబ్ బాషా, ఎర్రన్న, వెంకటేశ్వరమ్మ, షేక్ రెహమత్బీ, తాటిపట్టి చెన్నమ్మ, మంగమ్మ, జానకమ్మ, ఖలీల్ ఫిరోజ్ ఖాన్, శ్రీత, బండి ఇబ్రహీం, రంగన్న తదితరులు గౌరవప్రదంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబును కలిశారు. వారు […]
వైస్ చైర్మన్గా కేశవరెడ్డి గారి రాఘవేంద్రరెడ్డి ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కోటిముల్లా రోకియా బీని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీ గౌరవాధ్యక్షుడిగా కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ను నియమిస్తూ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల పేర్లను ఖరారుచేసింది. కమిటీ అధ్యక్షుడిగా కోటిముల్లా రోకియాబీ, ఉపాధ్యక్షుడిగా కేశవ రెడ్డి గారి రాఘవేంద్ర రెడ్డి, సభ్యులుగా సాంబశివారెడ్డి, మధుసూదన్ రెడ్డి, […]
సారథి న్యూస్, కర్నూలు: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో దళిత యువతిపై దారుణానికి పాల్పడిన మానవమృగాలను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ 19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో దుకాణాలు నిర్వహించుకునే వేళలు పెంచేలా అవకాశం కల్పించాలని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ను రిటైల్ వ్యాపార దుకాణ యజమానులు కోరారు. గురువారం వైఎస్సార్సీపీ ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు. లాక్డౌన్ కారణంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను తెరుచుకుని వ్యాపారాలు జరుపుకుంటున్నామని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని […]
సారథి న్యూస్, కర్నూలు: దేశంలో దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని, ఘటన జరిగిన వెంటనే దోషులను పట్టుకుని ఉరితీస్తే తప్పా మార్పు రాదని లీడర్స్ యూత్ సొసైటీ, దళిత ప్రజాసంఘాల నాయకులు అన్నారు. యూపీలో పదిరోజుల క్రితం ఓ దళిత యువతిని నాలుక కోసి, మెడ, నడుము విరిచి అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడిన దుండగులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ గురువారం కర్నూలు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర ఎమ్మెల్యే […]