Breaking News

MLA ALA

బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి

బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి

సారథి న్యూస్​, దేవరకద్ర: కొత్తకోట మండలం కనిమెట్ట– జంగమాయపల్లి గ్రామాల బ్రిడ్జిని మంజూరుచేసి వెంటనే పనులు మొదలుపెట్టాలని మంత్రి హరీశ్​రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే దేవరకద్ర మండలం పేరూర్ లిఫ్టును మంజూరుచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరగా.. మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి […]

Read More
పర్యాటక కేంద్రంగా కోయిల్​సాగర్​

పర్యాటక కేంద్రంగా కోయిల్​సాగర్​

సారథి న్యూస్, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కోయిల్​సాగర్​ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అందుకోసం సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలసి శనివారం 7.7లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోయిల్ సాగర్ తో పాటు కోయిలకొండ, రామగిరిగుట్ట, రాంకొండ ప్రాంతాలు పర్యాటక కేంద్రాల […]

Read More
ఊరచెరువులోకి చేపపిల్లలు

ఊరచెరువులోకి చేపపిల్లలు

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని ఖతల్ ఖాన్ చెరువు, ఊరచెరువులో బుధవారం చేపపిల్లలను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వదిలారు. అనంతరం చెత్తసేకరణ వాహనాలను ప్రారంభించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Read More
ఎమ్మెల్యే.. ‘ఆల’ అలా..

ఎమ్మెల్యే.. ‘ఆల’ అలా..

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్ పల్లి బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కొద్దిసేపు సందడి చేశారు. కాసేపు గాలంతో చేపలు పట్టారు. చిన్నచింతకుంట మండలంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి తిరుగు ప్రయాణంలో బండర్​పల్లి వద్ద ఆగారు. అక్కడే చేపలు పడుతున్న వారి వద్దకు వెళ్లి గాలం తీసుకుని చేపలుపట్టారు. వాటిని చేతిలోకి తీసుకుని చూసి ముచ్చటపడ్డారు. […]

Read More
సరళాసాగర్ నీటి విడుదల

సరళాసాగర్ నీటి విడుదల

సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 31న ప్రాజెక్టు కట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లడంతో ఫండ్స్​రిలీజ్​ చేయించి యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. రైతులు ఇబ్బందిపడకుండా సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.

Read More