Breaking News

medak

రెగ్యులరైజేషన్​పై పంచాయతీ కార్యదర్శుల హర్షం

రెగ్యులరైజేషన్​పై పంచాయతీ కార్యదర్శుల హర్షం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొఫెషనల్ సమయాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించడంతో పాటు రెగ్యులర్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంపై మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో ముఖ్యమంత్రి తమ సమస్యలపై స్పందించడంతో వారు హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా నాయకులు నరసింహాగౌడ్, పంచాయతీ కార్యదర్శులు ప్రభాకర్ రమేష్ మహిపాల్ పాల్గొన్నారు.

Read More
ఘనంగా మొల్లమాంబ జయంతి

ఘనంగా మొల్లమాంబ జయంతి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తొలి తెలుగు మహిళ కవియిత్రి కుమ్మర్ల ఆడపడుచు మొల్లమాంబ (579)జయంతి సందర్భంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం కుమ్మరి పల్లి గ్రామంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భావితరాలకు తెలిసేలా ప్రభుత్వమే జయంతి వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుమ్మరి నాగరాజు, కుమ్మరి స్వామి, కుమ్మరి భిక్షపతి, కుమ్మరి శ్యాములు కుమ్మరి రాజు, కుమ్మరి సత్యనారాయణ, కుమ్మరి సంతోష్, కుమ్మరి లచ్చయ్య, కుమ్మరి కృష్ణయ్య, కుమ్మరి నర్సింలు పాల్గొన్నారు.

Read More
మల్చింగ్ సాగు.. బాగు

మల్చింగ్ సాగు.. బాగు

సారథి న్యూస్, రామాయంపేట: మల్చింగ్ పద్ధతుల్లో కూరగాయలను పండించడం ద్వారా ఎక్కువ లాభాలను సాధించవచ్చని మెదక్ జిల్లా డి ఏ ఓ పరుశురాం నాయక్ అన్నారు. కలుపు నియంత్రణలో ఉండి మొక్కకు కావాల్సిన ఎరువులు సమపాళ్లలో అందుతాయని వివరించారు. శుక్రవారం ఆయన మండలంలోని రాజాక్​పల్లి గ్రామంలో మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న కనుకరాజు అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సూచనలు, సలహాలు ఇచ్చారు.

Read More
యువకుల్లో నైపుణ్యం వెలికితీయాలి

యువకులను అన్నిరంగాల్లో ప్రోత్సహించాలి

సారథి న్యూస్, రామాయంపేట: గ్రామాల్లోని చాలా మంది యువకుల్లో రకరకాల నైపుణ్యం ఉన్నప్పటికీ గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో వారు అక్కడే ఉండిపోతున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ప్రైజ్ మనీ అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఇలాంటి టోర్నీలను నిర్వహించడం ద్వారా యువకుల నైపుణ్యం బయటకు […]

Read More
రైతుబీమా, సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల అందజేత

రైతుబీమా, సీఎం రిలీఫ్ ​ఫండ్​ చెక్కుల అందజేత

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన మంగలి వెంకయ్యకు సీఎం రిలీఫ్ ​ఫండ్ ​రూ.రెండు లక్షలు, పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన బొగ్గుల నాగమణికి రూ.ఐదులక్షల రైతు బీమా సహాయాన్ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనువాస్, జడ్పీటీసీ విజయ రామరాజు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ​మండలాధ్యక్షుడు మురళి పంతులు, సురేష్ గౌడ్, సర్పంచ్ ల ఫోరమ్ మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేణుగోపాల్ గౌడ్, […]

Read More
గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం

గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం

సారథి న్యూస్​, నిజాంపేట: తడి, పొడి చెత్తసేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పల్లెప్రగతి పనులను యాప్ లో నమోదు చేయాలని మెదక్ జిల్లా సీఈవో వెంకట శైలేష్ సూచించారు. శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఆయన పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాయని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్ కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాల్గొన్నారు

Read More
ఉధృతంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

ఉధృతంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మండలంలోని జంబికుంట, కమలాపూర్, చీలపల్లి, గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్​పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండలాధ్యక్షుడు మురళిపంతులు, ఎంపీపీ జంగం శ్రీనన్న, కిషన్, సర్పంచ్ లు కుంట్ల రాములు, సాయిలు, ప్రకాష్, ఎంపీటీసీ సభ్యుడు దామోదర్, సహకార సంఘం చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, అంజిరెడ్డి, పాండు, శంకరయ్య, భూమిరెడ్డి, రోశిరెడ్డి, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, అశోక్, సాయిరెడ్డి, మాణిక్యం, చీలపల్లి ఉపసర్పంచ్ పాల్గొన్నారు.

Read More
ఘనంగా శోభాయాత్ర

ఘనంగా శోభాయాత్ర

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం శివాజీ యువసేన, భజరంగ్ దళ్, వివేకానంద ఉత్సవ సమితి, శ్రీరామ్ సేన తదితర యువజన సంఘాల ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ‘జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్.. జై శివాజీ.. వీరభవానీ.. భారత్ మాతాకి జై’ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా భారీ శోభాయాత్ర […]

Read More