సారథి న్యూస్, కర్నూలు, మానవపాడు(జోగుళాంబ గద్వాల): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఒకేసారి 13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ఎగువ ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 17గేట్లను ఎత్తివేశారు. 1,51,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఔట్ ఫ్లో 1,59,542 క్యూసెక్కులుగా నమోదైంది. నీటి ప్రవాహంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాద వాతావరణాన్ని పంచుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు జూరాలకు నిలకడగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం జూరాలకు 63,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 60,856 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. నాలుగుగేట్ల ద్వారా 22,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 35,974 క్యూసెక్కుల […]
సారథి న్యూస్, నంద్యాల(కర్నూలు): కృష్ణానది జలాల్లో రాయలసీమకు తీవ్రఅన్యాయం జరుగుతోందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలోని రామకృష్ణ విద్యాలయంలో జేఏసీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తుంగభద్ర, కృష్ణానది జలాల్లో ఇంతవరకు పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు జరగలేదన్నారు. నీటి కేటాయింపులు ఉన్న గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.203 పేరుతో రాయలసీమను […]
ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల జూరాల నుంచి శ్రీశైలం వైపునకు కృష్ణానది పరవళ్లు సారథి న్యూస్, కర్నూలు: కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జాయిని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉరకలెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.759 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.560 […]
సారథి న్యూస్, హైదరాబాద్, అమరావతి: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రెండు రోజులుగా మసురు పట్టింది. ఐదురోజుల పాటు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు హైఅలర్ట్ […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, ఎస్.నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు, మహబూబ్నగర్ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తదితరుల బృందం పరిశీలించింది. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యతగా ఉండాలని సూచించింది. బృందంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, అంజయ్య […]
సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జలాశాయానికి మరింత వరద వచ్చింది. ఈ సీజన్లో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 3 టర్బయిన్ల ద్వారా 0.474 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ఉత్పత్తిని ప్రారంభించలేదు. శ్రీశైలలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 77,534 క్యూసెక్కులు కొనసాగుతోంది. రిజర్వాయర్పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, […]
డ్యామ్లో 815 అడుగుల నీటిమట్టం జూరాల 8గేట్లు ఎత్తి నీటి విడుదల సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉరకలెత్తుతోంది. కర్ణాటక, మహారాష్ర్ట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్కు నీటిని వదిలారు. అక్కడి నుంచి జూరాలకు ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.440 మీటర్లకు చేరింది. నీటి […]