Breaking News

JOURNALIST

టీ సర్కార్​కు హైకోర్టు కీలక ఆదేశాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్ట్​ ఫెడరేషన్​ నాయకుడు సత్యనారాయణ హైకోర్టులో రిట్​ పిటిషన్​​ దాఖలు చేశారు. నాలుగు నెలలుగా జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం జర్నలిస్టులను ఆదుకోవాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. పిటిషనర్​ విన్నవించిన […]

Read More

ఆ స్ఫూర్తితోనే విలేకరి అయ్యా

గిరిజనుల స్థితిగతులపై రాసిన కథనాలు సీఎంనే కదిలించాయ్​ జర్నటిస్టులకు వృత్తిపట్ల శ్రద్ధ, పరిస్థితులపై క్షుణ్ణత ఉండాలి మాతృభాష మన మన అస్తిత్వం.. మనమే బతికించుకోవాలి సీనియర్​ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు సారథి ‘జర్నలిస్టు’తో ముఖాముఖి ‘అది 2001.. పదిరోజుల పాటు జోరువానలు.. భువనేశ్వర్‌లో భీకర పరిస్థితి, తాటిచెట్టు ఎత్తంత ప్రవహించే వరద.. ఒక్కసారి మా ప్రాణాలు పోయినంత పనైంది. అయినా కూడా సైన్యానికి చెందిన బోట్లలో వెళ్లి కథనాలు రూపొందించాం.’ అని సీనియర్​ జర్నలిస్ట్, కవి, రచయిత, […]

Read More

ఇద్దరు పిల్లలతో కలిసి విలేకరి ఆత్మహత్య

సారథిన్యూస్​, ఖమ్మం: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ విలేకరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యానాంకు చెందిన ముమ్మిడి శ్రీనివాస్​(36) ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. కాగా శనివారం అతడు తన ఇద్దరు పిల్లలతో కలిసి యానాంలోని గోదావరి నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Read More

జర్నలిస్టులకు కరోనా టెస్టులు

సారథిన్యూస్​, వరంగల్​ అర్బన్​: వైద్యులతోపాటు జర్నలిస్టులు కూడా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారని వరంగల్అర్బన్ జిల్లా డీఎంహెచ్​వో లలిత దేవి పేర్కొన్నారు. పాత్రికేయులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ విధులను నిర్వర్తించాలని కోరారు. శనివారం వరంగల్​ ప్రెస్​క్లబ్​ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్​ ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి పేరుమాండ్ల వెంకట్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, […]

Read More

మనోజ్​కు ఘన నివాళి

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా బారినపడి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మనోజ్​కుమార్​ మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వట్టికొండ రవి, లక్ష్మణ్ నరసింహారావు, రాజేష్, మోటమర్రి రామకృష్ణ, మహమ్మద్ షఫీ, ప్రభాకర్ రెడ్డి, […]

Read More