Breaking News

COVID19

పేదలకు సరుకులు పంపిణీ

పేదలకు సరుకులు పంపిణీ

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో […]

Read More
పారిశుద్ధ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం

పారిశుద్ధ్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం

సారథి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీసులో అంగన్ టీచర్లు, ఆయాలకు వివిధ సంస్థలు వితరణగా అందజేసిన శానిటైజర్, ఫేస్ షీల్డ్, మాస్కులను కలెక్టర్ జి.రవి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమై వాతావారణంలో సంభవించే మార్పుల కారణంగా ప్రజలు మలేరియా, డెంగీ వంటి అనారోగ్యాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై మురుగునీరు నిలువకుండా చూడాలని సూచించారు. అనారోగ్యాల బారినపడి అప్పులు తీసుకొచ్చి వైద్యం చేయించుకునే దుస్థితి కలగకుండా ఇంటి […]

Read More
కంటైన్ మెంట్ జోన్ గా చెరుకూరు

కంటైన్ మెంట్ జోన్ గా చెరుకూరు

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు పంచాయతీలో వారం నుంచి కరోనా వైరస్ ఉధృతి 30శాతం పాజిటివ్ రేటు పెరుగుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా, ఆయన స్పందించి ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా చేయాలని ఆదేశించారు. శుక్రవారం మోతుకులగూడెం, రేగులపాడు, బయ్యారం గ్రామాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రామస్తులను 14రోజుల పాటు వేరే ఊరికి వెళ్లకుండా, ఇతరులు ఆ […]

Read More
జూన్ 15 దాకా లాక్ డౌన్

జూన్ 10 దాకా లాక్ డౌన్.. టైం మినహాయింపు

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం పదిరోజుల పాటు అనగా.. జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సమావేశానికి రాష్ట్రమంత్రులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు […]

Read More
పండ్ల ధరలకు రెక్కలు

పండ్ల ధరలకు రెక్కలు

కరోనా ప్రభావమే కారణం అవసరాన్ని సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు సారథి, రాయికల్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. కొందరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా మరికొందరు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.ఈ సమయంలో వైద్యులు, నిపుణులు పండ్లను అధికంగా తినడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. తద్వారా వైరస్ నశించిపోతుందని చెబుతున్నారు. వ్యాధి బారినపడిన పేదలు త్వరగా కోలుకోవాలనే తపనతో పండ్లను కొని తిందామంటే వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితుల్లో పండ్లను కొనుగోలుచేసి తినే పరిస్థితి […]

Read More
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

సారథి, జగిత్యాల రూరల్: లాక్ డౌన్ నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం ధరూర్ గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేదంటే ఏదైనా ముఖ్యమైన పనిఉంటే 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

Read More
కరోనాతో యువకుడి మృతి

కరోనాతో యువకుడి మృతి

సారథి, పెద్దశంకరంపేట: కరోనాతో యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని జంబికుంట గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యువకుడు మంగళవారం ఉదయం స్థానిక  ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలుగు పాజిటివ్ కేసులు ఒకేరోజు 25 మందికి పరీక్షలు చేయగా అందులో నాలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ […]

Read More
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట్ లో ప్రతి లచ్చయ్య ఇటీవల కరోనతో మృతిచెందాడు. కుటుంబాన్ని ఆదుకునేందుకు యువకులు సేకరించిన రూ.40వేలను మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీ ఎడవెళ్లి నరేందర్, ఉపసర్పంచ్ ఎడవెళ్లి మధుసూదన్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై విజయ్, సిద్దార్థ, పురాణం రమేష్, టేకు రాజేశం పాల్గొన్నారు.

Read More