యువతను మరోసారి మోసం చేసేందుకు కుట్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి సారథి న్యూస్, మహబూబ్నగర్: నిరుద్యోగుల ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ఏనాడూ మాట్లాడని వ్యక్తులు గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతున్నారని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి ప్రశ్నించారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వంచిత్ బహుజన అగాడీ పార్టీ, బహుజన, యువజన, […]
సారథి న్యూస్, అలంపూర్(మానవపాడు): జోనల్ వ్యవస్థకు అనుమతించకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో న్యాయవాదులకు రూ.100 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ఫంక్షన్ హాల్ లో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అధ్యక్షతన టీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యేమ దుర్గపతి ఆధ్వర్యంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు ఎల్లబోయిన బాబు, నల్ల యాదగిరి, నల్ల కృష్ణ, ముండ్రాతి ఆంజనేయులు పాల్గొన్నారు.
హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్రావు అలర్ట్ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 6, 7, 8వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తరగతులను మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మంత్రి స్పష్టంచేశారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మాయమాటలు చెప్పి ప్రజలను సీఎం కేసీఆర్ మోసగిస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు అన్యాయం చేసిందన్నారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో పార్టీ మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు నిండిన గొల్ల కురుమలకు రూ.3వేల పింఛన్, రూ.ఆరులక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న జిల్లా […]
సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ […]
రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం కార్పొరేట్ శక్తులకు చేతుల్లోకి వ్యవసాయం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథి న్యూస్, దేవరకొండ: దళిత, గిరిజనులను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని డిండి ప్రాజెక్టులో ఎత్తేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంతానికి డిండి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఐదేళ్లలో ఒక్క ఎకరాకైనా పారించారా? అని అని ప్రశ్నించారు. రైతుల గుండెల్లో అంతులేని ఆవేదన, భయం […]