చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ నెల 5న బాలుకు కరోనా సోకడంతో చెన్నైలోని ఏజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. […]
చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రాంతీయభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లను పెట్టాలన్న నిబంధన ఉందని, అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. తమిళనాడులో విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తున్నామని ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా హిందీని మూడో లాంగ్వేజ్గా […]
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రముఖ సినీ నిర్మాత దివంగత ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్కు కొంత కాలంగా తీవ్రమైన ఘర్షణ జరుగుతున్నది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు కేసులు పెట్టుకొనే స్థాయిలో గొడవపడ్డారు. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణమేమీటోనని సినీవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ నిర్మాత ఎల్వీ ప్రసాద్ చెన్నైలోని తన స్టూడియోలో ఓ పెద్ద గదిని ఇళయరాజాకు బహుమతిగా ఇచ్చారు. ఆ గదిలోనే ఇళయరాజా మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటుచేసుకొని .. దాన్ని వాడుకుంటున్నారు. […]
సోషల్మీడియాలో వేధింపులు భరించలేక తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పనన్కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారులు తనను వేధింపులకు గుర్తిచేస్తున్నారని ఆమె ఫేస్బుక్లో విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు. గమనించిన స్థానికులు ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ”ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర […]
తమిళ హీరో, నిర్మాత విశాల్కు, ఆయన తండ్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. విశాల్కు కరోనా సోకిందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా విశాలే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘ముందుగా మా నాన్న(జీకే రెడ్డి)కు కరోనా సోకింది. అతడికి నేను సేవలు చేశాను. దీంతో నాకు లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయుర్వేద మందులు వాడి నేను మా […]
చెన్నై: తమిళనాడు గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్లో పనిచేస్తున్న 84 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 147 మందికి పరీక్షలు చేయగా 84 మందికి కరోనా సోకడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నది. వీరంతా రాజ్భవన్ పరిసరాల్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ 84 మందిలో ఏ ఒక్కరూ కూడా ఇటీవల గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ను కాంటాక్ట్ కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.
‘ఎవరు’ సినిమాతో రెజీనా కసాండ్రాలోని బోల్డ్ నెస్ ఒక్కసారిగా బయటపడింది. అది ‘నక్షత్రం’, మిస్టర్ చంద్రమౌళి’ సినిమాల్లో మరింత రెచ్చిపోయింది. చెన్నైలో పుట్టి పెరిగి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట తమిళంలో ‘కన్డనాల్ ముదల్’ సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తెలుగులో ‘ఎస్ఎంఎస్’ సినిమాతో తన సినీకెరీర్ ప్రారంభించిన రెజీనా తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ, ‘పవర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలు గుర్తింపు ఇచ్చాయి. హద్దులు పెట్టుకోకుండా నటిస్తున్న రెజీనా బాలీవుడ్లో సోనమ్ కపూర్ […]
చెన్నై: త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యావీరప్పన్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని […]