ఆపదలో ఎవరున్నా తక్షణం స్పందించే నటుడు సోనూసుద్.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్ రాజపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు అనే రైతుకు పొలం దున్నేందుకు ఎద్దులు లేవు. దీంతో తన కుమార్తెలను కాడెద్దులుగా చేసుకుని పొలాన్ని దున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్విట్టర్లో కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ వీడియోను సోనూసూద్కు ట్యాగ్ చేశాడు. దీంతో చలించిపోయిన ఆయన నాగేశ్వర్రావుకు సాయం చేయాలనుకున్నాడు. […]
అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్ఎస్టేట్ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్ విద్యానగర్లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]
సారథి న్యూస్, రామగుండం: అంబేద్కర్ యువజన సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దళితనేత దివంగత మైసన్న సేవలు మరువలేనివరి దళితసంఘాల నాయకులు కొనియాడారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్లో మైసన్న వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ దళితసంఘాల నాయకులు పోగుల రంగయ్య, కొంకటి లక్ష్మణ్, మంతెన లింగయ్య. దుబాసి బొందయ్య, శంకర్, రామునాయక్, సిద్ధార్థ, శనిగరపు రామస్వామి. లచ్చులు, గంటయ్య, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ‘అల వైకుంఠ పురములో’ చిత్రంతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు బన్నీ. వెంటనే కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్తో ‘పుష్ప’ చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందాన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా, స్టైలిష్ బన్నీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తొకటి వచ్చింది. మమ్ముటి ప్రధాన పాత్రలో యదుగూరి […]
అమరావతి: ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి కట్టుకోవాలని చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సూచించారు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించింది. వ్యాధి నివారణకు కఠినచర్యలు తప్పవని స్పష్టంచేసింది.
సంచార సంజీవని వాహనాన్ని ప్రారంభించిన కర్నూలు డీఆర్వో పుల్లయ్య సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన సంచార సంజీవని(ప్రత్యేక బస్సు) సేవలను విస్తృతం చేయాలని కర్నూలు డీఆర్వో పుల్లయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించేందుకు సిద్ధం చేశామన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాటుచేసిన సంచార సంజీవని ప్రత్యేక వాహనాన్ని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు డీఆర్వో […]
అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. రూ.ఐదులక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి వర్తింపు చేస్తామన్నారు. గురువారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆస్పత్రులకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తామన్నారు. 1.42కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామన్నారు. వైద్యం ఖర్చు […]
అమరావతి: పార్టీ ఏదైతేనేం తమ పట్టు నిలుపుకోవాలనుకునే వారు ఆ నేతలు. అధికారం తమ చేతుల్లోనే ఉండాలని కోరుకుంటారు. పట్టు సాధించడం కోసం ప్రత్యర్థులకు ఎలా చెక్ పెట్టాలోనని నిత్యం ఆలోచిస్తుంటారు. వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా అదే పరిస్థితి. ఒకే పార్టీలో ఉన్నా అదే పరిస్థితి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆ ఇద్దరివీ భిన్నధృవాలు. పోటాపోటీగా బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకుందామని సవాల్ విసురుకునేవారు. అటువంటిది ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. పచ్చిగా చెప్పాలంటే […]