సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా ఆంక్షలతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. డీజిల్ ధరలు అమాంతం పెరుగడంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్నది.దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న డీజిల్ ధరలు..సంస్థకు మోయలేని భారంగా మారాయి. ఓ వైపు ఆక్యుపెన్సీ లేక.. మరోవైపు పెట్రో భారం కలిసి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతోంది తెలంగాణ ఆర్టీసీ. కరోనా నిబంధనల వల్ల తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సగం సీట్లలోనే ప్రయాణికుల్ని అనుమతిస్తున్నారు. వైరస్ భయంతో ప్రజలు ఆ సగం […]
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం పాపకొల్లులో శుక్రవారం ఆయన విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 2.83 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడంతోపాటు.. రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం […]
28-06-2020 తెలంగాణలో కరోనా ఉగ్రరూపం, ఆదివారం కొత్తగా 983 పాజిటివ్కేసులు నమోదు, మొత్తం 14,418కు చేరిన కేసుల సంఖ్య, తాజాగా నలుగురు మృత్యువాత, ఇప్పటి వరకు 247 మంది మృతి, యాక్టివ్కేసులు 9 వేలు, జీహెచ్ఎంసీ పరిధిలో 816, రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్ జిల్లాలో 29 కేసుల నిర్ధారణ. 27-06-2020 నంద్యాల ఎస్పీవై ఫ్యాక్టరీలో శనివారం గ్యాస్ లీక్, ఒకరి మృతి.. పలువురికి అస్వస్థత, సంఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ, విశాఖపట్నం ఆర్ఆర్ […]
సారథి న్యూస్, ఇబ్రహీంపట్నం: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్, ఎలిమినేడు గ్రామాల్లో మొక్కలు నాటి ప్రారంభించారు. తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్,వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. చాపకింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది. గురువారం తాజాగా 920 కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో 11వేల పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 230కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 737, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 23 కేసుల చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 6,446 యాక్టివ్కేసులు […]
సారథిన్యూస్, నెట్వర్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరాడంబరంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, చింతకాని మండలాల్లో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం క్రాస్ రోడ్ లో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ […]
సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అన్నదాతల పాలిట గొప్పవరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం లేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన దుర్గం రములు అనే రైతు ఇటీవలే చనిపోగా అతడి కుటుంబానికి బుధవారం ఎమ్మెల్యే రైతు బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ […]
తెలంగాణ రైతుల పరిస్థితి ఇది ఖరీఫ్ రుణాలకు సవాలక్ష కొర్రీలు ఈ ఏడాది రూ.33,713 కోట్ల లక్ష్యం ఇప్పటి వరకు ఇచ్చింది రూ.500కోట్లు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రైతులు పంట పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు రైతులందరికీ లోన్లు ఇవ్వడం లేదు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నా.. నిర్దేశించిన లక్ష్యంలో ఒక శాతం మేర కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వలేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవాల్సి వస్తోంది. బ్యాంకులు పంట […]