లండన్: కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. వేలాది కేసులు నమోదవుతూ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గుడ్న్యూస్ అందిచనుందని తెలుస్తోంది. ఫేస్ – 1 ట్రయల్స్ ఫలితాలు పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు లేవని, ఇది సురక్షితమైన వ్యాక్సిన్గా పరీక్షల్లో తేలిందని సమాచారం. దీనికి సంబంధించి వివరాలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ త్వరలోనే తెలిపే […]
సంచార సంజీవని వాహనాన్ని ప్రారంభించిన కర్నూలు డీఆర్వో పుల్లయ్య సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన సంచార సంజీవని(ప్రత్యేక బస్సు) సేవలను విస్తృతం చేయాలని కర్నూలు డీఆర్వో పుల్లయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించేందుకు సిద్ధం చేశామన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాటుచేసిన సంచార సంజీవని ప్రత్యేక వాహనాన్ని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు డీఆర్వో […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. గురువారం ఆయన వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజాతో సమీక్షించారు. మార్చిన 2న రాష్ట్రంలో కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు, వైద్యసిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేట్ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాల్లో మందులు, డాక్టర్లు అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల కోరారు.
సారథి న్యూస్, అనంతపురం : స్వీయ జాగ్రత్తలతోనే కరోనా కట్టడి సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని రెండో రోడ్డులో ఉన్న మెప్మా కార్యాలయం వద్ద గురువారం ర్యాగ్ పిక్కర్స్ (వీధుల్లో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు), నిరాశ్రయ కుటుంబాలకు కోవిడ్-19 కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా టెస్టులు వేగవంతం చేయడానికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,676 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 41,018 నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 396కు చేరింది. రాష్ట్రంలో 2,22,693 శాంపిళ్లను పరీక్షించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 788, రంగారెడ్డి 224, మేడ్చల్160, సంగారెడ్డి 57, వరంగల్అర్బన్ 47, కరీంనగర్92, మహబూబాబాద్19, మెదక్26, నల్లగొండ 64, నాగర్కర్నూల్30, వనపర్తి 51, సూర్యాపేట, నిజామాబాద్ […]
సారథి న్యూస్, రామడుగు: కరోనా లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఓ స్వచ్చందసంస్థ ఆదుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని జెబెల్ అలీ ప్రాంతంలోని లేబర్ క్యాంపులో తలదాచుకుంటున్న పేదలకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి ఉపాధ్యక్షుడు బాలు బొమ్మిడి, మీడియా కోఆర్డినేటర్ చిలుముల రమేశ్, ముఖ్య సలహాదారులు మోహన్ రెడ్డి, అశోక్ జంగం, సోషల్ మీడియా కోర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, మాల్యాల, జెబెల్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో […]
సారథి న్యూస్, కోదాడ : రాష్ర్టంలో కరోనా విస్తరణ రోజురోజుకు పెరిగిపోతుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కుక్కడపు ప్రసాద్ అన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, వైరస్ బారిన పడిన పేదవారు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకోలేక పోతున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ బుధవారం కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆ పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్ది పద్మావతి, ఎం.ముత్యాలు, నాగరాజు, జె.సాయి […]