బాలీవుడ్ యువనటుడు అర్జున్ కపూర్, అతడి ప్రేయసి మలైకా అరోరాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ కపూర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘ నాకు కరోనా సోకింది. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం నా బాధ్యత. అయితే నాకు ఎటువంటి లక్షణాలు లేవు. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది. వైద్యుల సలహామేరకు హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. ఎవరికైనా కరోనా సోకితే బాధపడకండి. సరైన మందులు వాడితే ఈ రోగం […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) కొత్తగా 1,802 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కు చేరింది. తాజాగా 9 మంది కోవిడ్ వ్యాధిబారినపడి చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 895కు చేరింది. తాజాగా 2,711 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,10,241కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్కేసుల సంఖ్య 31,635 ఉంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు […]
సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక కూరగాయల మార్కెట్ యార్డు ఆవరణను కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ సందర్శించారు. విక్రయదారుల బాధలుసాదకాలు తెలుసుకున్నారు. ప్రస్తుత సమయంలో ఎక్కువ ధరలకు అమ్మకుండా సామాన్యులకు అందుబాటులో రేట్లు ఉండేలా అమ్మాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లోనే దాదాపు 90,632 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు 1065 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులసంఖ్య 41,13,811 కు పెరిగింది. ప్రస్తుతం 8,62,320 యాక్టివ్ కేసులు ఉండగా.. 70,626 మంది మృత్యువాత పడ్డారు. కాగా కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందునే.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ […]
యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి అనేక దేశాలను గడగడలాడిస్తూ ప్రపంచ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా నివారణకు అనేక దేశాల శాస్త్రవేత్తలు వారి శక్తివంచనలేకుండా ఎక్కువకాలం ప్రయోగశాలల్లోనే గడుపుతూ వాక్సిన్ కనుక్కోవడానికి శ్రమిస్తున్నారు. ఈ భయానక మహమ్మారి అనూహ్యంగా విజృంభిస్తుండడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికి సంకోచిస్తూ, తప్పక బయటకు రావాల్సిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలపై ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని కరోనా ప్రతాపం చాలా దేశాలపై ఇంకా […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శనివారం(24గంటల్లో) 10,825 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు చేరింది. కొత్తగా 71 మంది కరోనా వ్యాధితో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,347కు చేరింది. 24 గంటల్లో 11,941మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 3,82,104 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 69,326 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 40,35,317 శాంపిళ్లను టెస్ట్చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్ కేసులు రికార్డు అయ్యాయి. […]
సారథి న్యూస్, సత్తుపల్లి : కరోనా విపత్తువేళ.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గొప్పమనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న రోగులకు తనవంతుగా రూ.500 ఆర్థికసాయం, కూరగాయలు, నిత్యవసరాలు అందజేశారు. ( 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కేజీ మంచినూనె, ఉల్లిపాయలు, ఉప్మారవ్వ, కారం, పసుపు, ఉప్పు, పంచదార, సబ్బులు, కూరగాయలు, 30 కోడిగుడ్లు) కరోనా వ్యాధిసోకిన నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే సాయం చేసినట్టు చెప్పారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన […]
న్యూఢిల్లీ : భారత్ లో కోవిడ్-19 ఉధృతి నానాటికీ విజృంభిస్తున్నది. దేశంలో శుక్రవారం రికార్డుస్థాయిలో 86,432 కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 40 లక్షలు (40,23,179) దాటింది. దీంతో ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానానికి చేరింది. బ్రెజిల్ కు మన దేశానికి మధ్య వ్యత్యాసం 70 వేల కేసులు మాత్రమే. ఇక శుక్రవారం దేశవ్యాప్తంగా 1,089 మంది కరోనా బారినపడి మరణించగా.. […]