Breaking News

వేతనాలు

బీడీ కార్మికులను ఆదుకోవాలి

బీడీ కార్మికులను ఆదుకోండి

సారథి న్యూస్, రామాయంపేట: బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందాన్ని అమలు చేయాలనితెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదారి మల్లేశం డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన మెదక్​ జిల్లా రామాయంపేటలో ప్యాకింగ్​ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతన ఒప్పందం ముగిసి దాదాపు ఆరు మాసాలు గడుస్తున్నా బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందం చేయకుండా కార్మికులను దోపిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బండారి కుమార్, లక్ష్మణ్, బి రాజు, […]

Read More

మెప్మా ఆర్పీలకు జీతాలివ్వండి

సారథి న్యూస్​, హుస్నాబాద్: మున్సిపాలిటీలలో పని చేస్తున్న మెప్మా ఆర్పీలకు   వేతనాలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడుతూ.. మెప్మా ఆర్పీలకు సంవత్సరం నుంచి వేతనాలు అందించడం లేదని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్, మెప్మా డైరెక్టర్ వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని డిమాండ్​ చేశారు.

Read More
కార్మికులకు వేతనం ఇవ్వండి

కార్మికులకు వేతనం ఇవ్వండి

సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులతో పాటు రెడ్​ జోన్​లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో పాటు ప్రోత్సాహకంగా రూ.8వేలు చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్​ చేశారు. బుధవారం స్థానిక జ్యోతిభవన్ లో ఎన్టీపీసీ ఈడీ రాజ్ కుమార్ తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ప్రకటించినట్లుగా ఎన్టీపీసీ నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి […]

Read More