Breaking News

మృతదేహం

సగం కాలిన డెడ్​బాడీ లభ్యం

సగం కాలిన డెడ్​బాడీ లభ్యం

సారథి న్యూస్, గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో సగం కాలిపోయిన గుర్తుతెలియని డెడ్​బాడీని స్థానికులు బుధవారం గుర్తించారు. నాగిరెడ్డిపల్లిలోని పెద్దచెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుర్తుతెలియని దుండగులు హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసినట్లు భావించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఆచూకీ తెలిసిన వారు ములుగు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డెడ్​బాడీని గజ్వేల్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. […]

Read More

మోకే ఉరితాడైంది

సారథిన్యూస్​, గోదావరిఖని: కల్లు తీసేందుకు వెళ్లిన ఓ గీతకార్మికుడికి.. మోకు మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామంలో విషాదం నింపింది. గుర్రంపల్లికి చెందిన మామిడి రాజు ప్రతిరోజు మాదిరిగానే కల్లు తీసేందుకు మోకు సాయంతో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు.. మెడకు చుట్టుకున్నది. దీంతో ఉపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి గీతకార్మికులు మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దించారు.

Read More