Breaking News

చిన్నశంకరంపేట

సూరారంలో ముగ్గుల పోటీలు

సూరారంలో ముగ్గుల పోటీలు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ద్వారక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ హాజరై పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో వరుసగా పద్మగల్ల లక్ష్మి, కుమ్మరి నవ్య, నిమ్మగల్ల సరిత, నిమ్మగల్ల విజయ మొదటి, రెండవ, మూడవ, నాలుగవ బహుమతులను గెలుచుకున్నారు. మహిళలను చైతన్యపరిచేందుకు పోటీలు నిర్వహించామని గ్రామ సర్పంచ్ నీరజ పవన్ […]

Read More
సంక్రాంతి వేళ విషాదం

సంక్రాంతి వేళ విషాదం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నిమ్మతోట ఆంజనేయులు(38) చిన్నశంకరంపేటలో వీక్లీ మార్కెట్ ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. చిన్నశంకరంపేట – అంబాజీపేట గ్రామాల సరిహద్దు కల్వర్టుపై మెదక్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎక్సెల్ పై వెళ్తున్న ఆంజనేయులు తలకు తీవ్ర […]

Read More
స్కూళ్లను త్వరగా ఓపెన్​ చేయాలి

స్కూళ్లను త్వరగా ఓపెన్​ చేయాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: కరోనా నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తగిన జాగ్రత్తలు పాటిస్తూ పునఃప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలాధ్యక్షుడు గిరిబాబు కోరారు. సోమవారం ఆయన ఎంపీడీవో గణేష్ రెడ్డి చేతుల మీదుగా టీఎస్ యూటీఎఫ్​ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలస్యం చేయకుండా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపతి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఫణింద్రచారి, ఉపాధ్యాయులు రామబ్రహ్మకుమార్, విఠోబా, స్వామి, ప్రవీణ్ […]

Read More
సహకార సంఘం చైర్మన్ మృతి

సహకార సంఘం చైర్మన్ కన్నుమూత

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: గుండెపోటుతో చిన్నశంకరంపేట సహకార సంఘం వైస్ చైర్మన్ గుడికాడి కిష్టగౌడ్(56) సోమవారం మడూర్ గ్రామంలోని తన నివాసంలో కన్నుమూశారు. గతంలో చైర్మన్ పదవిలో కొనసాగిన తిగుళ్ల బుజ్జి మరణించడంతో ఇన్​చార్జ్ ​చైర్మన్ గా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన మరణంతో సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. కిష్టగౌడ్ మృతి పట్ల సొసైటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.

Read More
ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ ​జిల్లా చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కోవిడ్​–19 వ్యాక్సినేషన్ పై ఏఎన్ఎం,ఆశా వర్కర్లకు మెడికల్ ఆఫీసర్ శ్రావణి శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్​ను మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ హెల్త్, పోలీస్, శానిటేషన్ సిబ్బందికి, తర్వాత 60 ఏళ్లు పైబడిన, మరియు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు, అలాగే 50 ఏళ్లు పైబడిన వారికి, చివరగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. […]

Read More
మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి

మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని చిన్నశంకరంపేట ఎస్సై మహమ్మద్ గౌస్ ఆకాంక్షించారు. శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో మహిళా మండలి అధ్యక్షురాలు గంగ, మహిళలతో కలిసి ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బందిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంగ మాట్లాడుతూ.. మహిళా సమస్యలు, ఆడపడుచుల మిస్సింగ్ కేసులు, భార్యాభర్తల గొడవలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరిస్తున్న పోలీసుల సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో ఏఎస్సై గంగయ్య, హెడ్ […]

Read More
తేమ లేని వడ్లు తీసుకురండి

తేమ లేని వడ్లు తీసుకురండి

సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ధాన్యంలో తేమ లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మెదక్​జిల్లా కలెక్టర్​ఎం.హనుమంతరావు సూచించారు. సోమవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద రోడ్డుపై వడ్లను ఆరబోసిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. ప్రస్తుతం కొన్నిచోట్ల వరి నూర్పిడి పూర్తయిందని, అయితే అకాల వర్షాలు కురవడంతో వడ్లను రోడ్డుపై ఎండబెట్టామని రైతులు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ ​హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు […]

Read More
బీజేపీ కమిటీ ఎన్నిక

బీజేపీ కమిటీ ఎన్నిక

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సూచన మేరకు ఆదివారం చిన్నశంకరంపేట బీజేపీ మండల కమిటీతోపాటు మోర్చా అధ్యక్షుల కమిటీని నియమించినట్లు మండలాధ్యక్షుడు మంగలి యాదగిరి తెలిపారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్త, ప్రకాష్ హాజరయ్యారు. నరేందర్, దశరథ్, ప్రధాన కార్యదర్శులుగా పెంటాగౌడ్, మేడిస్వామి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, గోపాల్ లు ఉపాధ్యక్షుడిగా వడ్ల సిద్ధిరాములు, సంతోష్ రెడ్డి, సురేష్, కార్యదర్శులుగా బాలసుబ్రమణ్యం కోశాధికారిగా ఎంపికయ్యారు.

Read More