సారథి న్యూస్, శ్రీకాకుళం: నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ‘జగనన్న చేదోడు’ కార్యక్రమం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టైలర్ వృత్తిదారులు, నాయీ బ్రాహ్మణులు, రజకుల ఆర్థిక కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్నానని వివరించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అర్హులు ఏ ఒక్కరూ మిస్ కాకూడదని సూచించారు. జూలై 8న ఇళ్లపట్టాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా సంతబొమ్మాళి మండలం, కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి కోటా రవి నియమితులయ్యారు. వాషింగ్టన్లోని రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకానమిక్ మినిస్టర్గా విధులు నిర్వహించనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి భారత్ తరఫున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నియామకాల కమిటీ గురువారం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పి.నల్లనయ్య అన్నారు. కరోనా నేపథ్యంలో బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. మురుగు నీటి కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలని, బ్లీచింగ్ ప్రతిరోజూ చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు మాస్కులు తప్పనిసరి కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని తెలిపారు.
సారథి న్యూస్, శ్రీకాకుళం: మూగజీవాలను ఆదుకునే క్రమంలో అంకితభావంతో సేవచేసే వారికి గ్రీన్ మెర్సీ సంస్థ అరుదుగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘యాక్షన్ ఫర్ ఎనిమల్స్’ అవార్డుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఎంపికయ్యారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ముఖ్య అధికారి రమణమూర్తి ఈ అవార్డును కలెక్టర్కు అందజేశారు. మూగజీవాల ఆకలిబాధ తీర్చేందుకు కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమాలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో డీఆర్వో బి.దయానిధి, జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్ ఎల్.రమేష్ ఇతర […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: సివిల్ సప్లయీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పీపీసీ కేంద్రాల్లో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్స్ ను ప్రభుత్వం కంటిన్యూ చేసి ఆదుకోవాలని టెక్నికల్ అసిస్టెంట్స్ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మంత్రి కృష్ణదాసును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాము ప్రైవేట్ జాబ్స్ వదులుకొని ఇందులో కొనసాగుతున్నామని, ప్రభుత్వ సంస్థ కావడంతో తమకు భవిష్యత్ ఉంటుందని భావించామన్నారు. మూడునెలల తర్వాత హోల్డ్లో పెట్టడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను సీఎం దృష్టికి […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో కొంత భాగాన్ని కోవిడ్ –19 ఆస్పత్రిగా సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఐదొందల పడకల సామర్థ్యంతో కోవిడ్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు. రోజుకు రెండువేల వైద్యపరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందన్నారు. పరీక్షలకు ముందుకు వచ్చే వారికి టోకెన్ జారీచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.చెంచయ్య, ప్రజారోగ్యశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర్రావు, ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు […]
సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ ఏపీ సీఎం వైఎస్జగన్ ఆదేశాలు సారథి న్యూస్, అనంతపురం: ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. కరోనా(కోవిడ్–19) నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్(వీఆర్డీఎల్)ను శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకాధికారి శశిభూషణ్ రావు, కలెక్టర్ జె.నివాస్ బుధవారం పరిశీలించారు. సిబ్బంది నియామక ప్రక్రియను కంప్లీట్ చేయాలని సూచించారు. ఇక్కడ ల్యాబ్ను ఏర్పాటు చేయడంతో కరోనా పరీక్షల ఫలితాలను ఇక్కడే పొందవచ్చన్నారు. కాకినాడకు వెళ్లే అవసరం ఉండదన్నారు. అనంతరం జిల్లా కోవిడ్ ఆస్పత్రి జెమ్స్ ను పరిశీలించారు. ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రంలోని […]