సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పి.నల్లనయ్య అన్నారు. కరోనా నేపథ్యంలో బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. మురుగు నీటి కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలని, బ్లీచింగ్ ప్రతిరోజూ చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు మాస్కులు తప్పనిసరి కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని తెలిపారు.
సారథి న్యూస్, శ్రీకాకుళం: మూగజీవాలను ఆదుకునే క్రమంలో అంకితభావంతో సేవచేసే వారికి గ్రీన్ మెర్సీ సంస్థ అరుదుగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘యాక్షన్ ఫర్ ఎనిమల్స్’ అవార్డుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఎంపికయ్యారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ముఖ్య అధికారి రమణమూర్తి ఈ అవార్డును కలెక్టర్కు అందజేశారు. మూగజీవాల ఆకలిబాధ తీర్చేందుకు కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమాలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో డీఆర్వో బి.దయానిధి, జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్ ఎల్.రమేష్ ఇతర […]
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టును మూడేళ్లలో పూర్తిచేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రామయ్యపట్నం, మచిలీపట్నం పోర్టులను పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ‘మన పాలన.. మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సానుకూల ప్రభుత్వం ఉందని, పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా చూస్తామని, ఎవరూ […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: సివిల్ సప్లయీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పీపీసీ కేంద్రాల్లో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్స్ ను ప్రభుత్వం కంటిన్యూ చేసి ఆదుకోవాలని టెక్నికల్ అసిస్టెంట్స్ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మంత్రి కృష్ణదాసును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాము ప్రైవేట్ జాబ్స్ వదులుకొని ఇందులో కొనసాగుతున్నామని, ప్రభుత్వ సంస్థ కావడంతో తమకు భవిష్యత్ ఉంటుందని భావించామన్నారు. మూడునెలల తర్వాత హోల్డ్లో పెట్టడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను సీఎం దృష్టికి […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: మొదటి ఏడాదిలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 90 శాతం వరకు పూర్తి చేశామని, ప్రజలకు ఇంకా ఏమి చేయాలనే ఆలోచనతో ఈ సదస్సులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం ‘మన పాలన, మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా తొలిరోజు ‘ప్రజా పాలన – సంక్షేమం’పై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది నుంచి […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో కొంత భాగాన్ని కోవిడ్ –19 ఆస్పత్రిగా సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఐదొందల పడకల సామర్థ్యంతో కోవిడ్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు. రోజుకు రెండువేల వైద్యపరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందన్నారు. పరీక్షలకు ముందుకు వచ్చే వారికి టోకెన్ జారీచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.చెంచయ్య, ప్రజారోగ్యశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర్రావు, ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు […]
శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ సారథి న్యూస్, శ్రీకాకుళం: గ్రానైట్ ఫ్లోరింగ్ తో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ బంగ్లాలో జిల్లాలోని గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్ తో సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపొందించడం కోసమే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు.. నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను నూతన హంగులు సమకూర్చనున్నామని తెలిపారు. నీటి సరఫరా, టాయిలెట్ల […]
పార్టీ శ్రేణులకు ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపు సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు. 23న అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. శ్రేణులు పేదలకు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ […]