Breaking News

పండుగలా ఏడాది పాలన

పార్టీ శ్రేణులకు ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపు

సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి సారథ్యంలో వైఎస్సార్​సీపీ ఘనవిజయం సాధించి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు. 23న అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. శ్రేణులు పేదలకు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ ఏడాది పాలన, ప్రగతిపై అన్ని గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే జయప్రదం చేయాలని కృష్ణదాస్ పిలుపునిచ్చారు.