సారథి, చొప్పదండి: సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిజాం సర్కార్తరహాలో పాలన కొనసాగిస్తోందని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయాలు, అక్రమాల మీద ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు దోపిడీ, అన్యాయం, బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. […]
సారథి, రామడుగు: మండల కేంద్రంలోని స్థానిక ఆర్య వైశ్య భవనంలో బీజేపీ రామడుగు మండల శాఖ కార్యవర్గ సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పార్టీ సంస్థగత నిర్మాణంపై చర్చించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్, మండల ఇన్చార్జ్ రాపర్తి ప్రసాద్, కృష్టారెడ్డి, జిన్నారం విద్యాసాగర్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సారథి, చొప్పదండి: నియోజకవర్గ అభివృద్ధి కోసం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్నేతలు హితవు పలికారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ సోమిడి శ్రీనివాస్, భక్తు విజయ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ కనుమల్ల రాజశేఖర్ తదితరులు చొప్పదండిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ […]
సారథి, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.5,41,500 సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం […]
సారథి, రామడుగు: ఆపదలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడి పట్ల సర్పంచ్ ఔదార్యం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు రేణిగుంట రాజమల్లయ్య శనివారం అనారోగ్యానికి గురైయ్యాడు. ఆయనను వెంటనే కరీంనగర్ సిటీ దవాఖానకు తరలించగా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. గోపాల్రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న వెంకట్రామిరెడ్డి శనివారం రాజమల్లయ్యను పరామర్శించి రూ.15వేలు అందజేశారు. వైద్యచికిత్సల కోసం అండగా ఉంటామని భరోసా కల్పించారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపూర్ గోశాల నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కీలనపల్లి గ్రామ వినాయక గోశాల వెల్ఫేర్ సొసైటీకి 20 కోడెలను శనివారం వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో గోలి శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఎల్.రాజేందర్, గోశాల ఇన్చార్జ్శంకర్ పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ సర్వేనం.41,42,43 వక్ఫ్ బోర్డు భూముల్లో నిర్మిస్తున్న అక్రమకట్టడాలను కాపాడాలని పలువురు ముస్లింలు శనివారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. తిప్పాపూర్ లో చాలా వరకు వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమై ఉన్నాయన్నారు. వాటికి రక్షణ కంచె వేసి కాపాడాలని కోరారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు వేములవాడ అర్బన్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.
సారథి, చొప్పదండి: సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరమని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సంబోజీ సునీల్, నెల్లి సంతోష్, బండారి అఖిల్ నాయకులు పాల్గొన్నారు.