Breaking News

కరీంనగర్

పట్టుపట్టి ఏడాదిలోనే నిర్మించుకుంన్రు

పట్టుపట్టి ఏడాదిలోనే నిర్మించుకుంన్రు

  – రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సామాజిక సారథి, సిద్దిపేట: పెన్షనర్లు పట్టుపట్టి ఏడాదిలోనే భవనం నిర్మించుకున్నారని ఎంపీ, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని విశాంత్రి ఉద్యోగుల భవనం ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్య పట్టణ కేంద్రాల్లో పెన్షనర్ల భవనాలు తప్పనిసరిగుండాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణాలకు అనేక చోట్ల నిధుల మంజూరు చేసిన నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఎంపీ నిధుల నుంచి […]

Read More
మూడేళ్లయినా పూర్తికాలే..

మూడేళ్లయినా పూర్తికాలే..

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం అస్తవ్యస్తంగా రామడుగు బ్రిడ్జి నిర్మాణ పనులు వర్షాకాలంలో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు సామాజిక సారథి, రామడుగు: ప్రజల సౌకర్యార్థం కోసం నిర్మించే కట్టడాలు ఆలస్యమవడంతో వాటితో ఎలాంటి ఉపయోగం లేకపోగా, లక్ష్యం నీరుగారిపోతోంది. కరీంనగర్​ జిల్లా రామడుగు శివారులోని వాగుపై సుమారు రూ.8కోట్ల వ్యయంతో మూడేళ్ల క్రితం నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మొదటి నుంచీ పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల […]

Read More
రామడుగులో 2కే రన్​సక్సెస్​

రామడుగులో 2కే రన్​ సక్సెస్​

సామాజిక సారథి, రామడుగు: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫిట్ రామడుగు సంస్థ, స్థానిక క్రీడాకారుల ఆధ్వర్యంలో కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల కేంద్రంలోని రైతువేదిక నుంచి స్థానిక ప్రభుత్వ హైస్కూలు గ్రౌండ్​ వరకు 2కే రన్ నిర్వహించారు. పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 50 మంది యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు ధ్యాన్ చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజేతలకు మొదటి బహుమతి గుర్రం తిరుమలేష్ […]

Read More
చిల్డ్రన్స్ పార్క్.. నేచురల్​మార్క్​

చిల్డ్రన్స్ పార్క్.. నేచురల్​ మార్క్​

సామాజిక సారథి, వేములవాడ: మారుతున్న ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే ఆస్పత్రుల పాలవుతున్న నేటి తరుణంలో పార్కులు, మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్​రోడ్డులో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, మున్సిపల్​చైర్​పర్సన్​రామతీర్థపు మాధవిరాజు చొరవతో చిల్డ్రన్​పార్కును ఆకట్టుకునేలా ఏర్పాటుచేశారు. పట్టణ ప్రజలు, చిన్నారులకు ఆహ్లాదం పంచేలా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని సౌందర్యంతో రకకరాల మొక్కలను పెంచారు. పిల్లలను […]

Read More
రాజన్న సన్నిధిలో టీఎస్​పీఎస్సీ సభ్యుడు

రాజన్న సన్నిధిలో టీఎస్​పీఎస్సీ సభ్యుడు

సామాజిక సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని శ్రావణ ఆదివారం సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు డాక్టర్​ చంద్రశేఖర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్తంగా ఆశీర్వదించారు. ఆలయ వెంట పీఆర్వో చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

Read More
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే ఉద్యమిస్తాం

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే ఉద్యమిస్తాం

              – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సామాజిక సారథి, సిద్దిపేట:  గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్, రంగ నాయక్ తోపాటు ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు ఏ ప్యాకేజీ అందించారో అదే విధంగా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోతున్న […]

Read More
బీసీలకూ రూ.10లక్షలు ఇవ్వాలి

బీసీలకూ రూ.10లక్షలు ఇవ్వాలి

సామాజిక సారథి, రామడుగు: ఎస్సీలతో బీసీలు, మైనార్టీలకు కూడా దళితబంధు మాదిరిగానే ప్రత్యేక పథకం అమలు చేయాలని కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల బీజేపీ నాయకులు కోరారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దూలం కళ్యాణ్, మేకల లక్ష్మణ్, బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు తీర్మాలపూర్ ఎంపీటీసీ మోడీ రవీందర్ తదితరులు బీసీబంధు దరఖాస్తు ఫారాన్ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలను […]

Read More
యువతకు వివేకానందుడే ఆదర్శం

యువతకు వివేకానందుడే ఆదర్శం

సామాజిక సారథి, చొప్పదండి: నేటి యువతకు వివేకానందుడు ఆదర్శప్రాయుడని కరీంనగర్​జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, నెహ్రూ యువకేంద్ర జిల్లా కోఆర్డినేటర్ వెంకట్ రాంబాబు కొనియాడారు. నెహ్రూ యువకేంద్ర, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా చొప్పదండిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. […]

Read More