Breaking News

క్రైమ్

ఘోర ప్రమాదం.. తెగిపడ్డ తల

నాందేడ్ – ఆకొలా హైవేపై ఘటన సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో గురువారం నాందేడ్ – ఆకొలా హైవేపై అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్​ లో ఓ వ్యక్తి తల మొండెం నుంచి వేరుపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చూసి స్థానికులు షాక్​కు గురయ్యారు. పెద్దశంకరంపేట మండలం ఉత్తులూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య అల్లాదుర్గం మండలం రాంపూర్ లోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. రోజు […]

Read More

పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగిన తల్లి

చిన్నారుల మృతి.. తల్లి పరిస్థితి విషమం సారథి న్యూస్​, మేడ్చల్​​: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చిన్నారులు చనిపోగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన గోపీనాథ్‌కు ప్రీతి అనే మహిళతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా వీరు మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలోని మజీద్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు గౌరవ్(4), కౌశిక్(3) ఉన్నారు. గోపీనాథ్‌ ఓ ప్రైవేట్​ సంస్థలో […]

Read More

స్లాబ్​ కూలి.. గాయాలు

సారథి న్యూస్​, యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో ఏర్పాటుచేస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ లోని ఒక భవనం వద్ద స్లాబ్ బుధవారం కూలింది. ఈ ప్రమాదంలో కూలీలు అప్పన్న (శ్రీకాకుళం), చెన్నయ్య (మహబూబ్‌నగర్), వెంకటస్వామి (మహబూబ్‌నగర్), రాములు(తాండూర్) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విల్లా-6 స్లాబ్ నిర్మాణం చేస్తుండగా నాణ్యత లోపించి స్లాబ్ సుమారు 20అడుగు లోతు మేర కూలింది.

Read More
చెరువులో మునిగి ముగ్గురు మృతి

చెరువులో మునిగి ముగ్గురు మృతి

 సారథి న్యూస్​,ఖమ్మం: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు (45) తన కొడుకు తేజు (20), మేనల్లుడు వినయ్ (19)తో కలిసి మంగళవారం పొలంలో కూరగాయల పంటకు పురుగు మందు పిచికారీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న రేపాక చెరువులోకి కాళ్లు కడుక్కునేందుకు వెళ్లారు . ఈ క్రమంలో తేజు చెరువులోకి దిగగా కాలు […]

Read More
రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

  • May 19, 2020
  • CRIME
  • SUICIDE
  • Comments Off on రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య

సారథి న్యూస్, మెదక్: రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట సమీపంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ వ్యక్తి, మరో మహిళ బైక్​పై వచ్చి మాసాయిపేట బంగారమ్మ గుడి వద్ద చెట్టు కింద ఆగారు. కొద్దిసేపటి తర్వాత నిజామాబాద్ వైపు నుంచి గూడ్స్ రైలు రావడం గమనించి ఆ ఇద్దరు రైలు పట్టల మీద తలపెట్టి పడుకున్నారు. దీంతో వారి తలల మీద […]

Read More
కారు ఢీకొని ఒకరి మృతి

కారు ఢీకొని ఒకరి మృతి

సారథి న్యూస్​, రామడుగు: కరీంనగర్​ జిల్లా మండలం వెదిర సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందేల్లి ప్రభాకర్ రావు(46) భార్యతో కలిసి బైక్ ​పై కొండగట్టు నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తుండగా, కరీంనగర్ నుంచి ఎదురుగా జగిత్యాల వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రభాకర్​రావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని భార్య తీవ్రంగా గాయపడింది. మృతుడి […]

Read More

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

సారథి న్యూస్​, రామాయంపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ నిజాంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం మృతిచెందారు. మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రంగ పోచయ్య(63) రెండు రోజుల క్రితం మామిడి పండ్లు తెంచే క్రమంలో చెట్టు పైనుంచి కాలుజారి కింద పడి.. చికిత్స పొందుతూ చనిపోయాడు. చల్మేడ గ్రామానికి చెందిన రాగుల పర్శరాములు(36) గత బుధవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్సపొందుతూ పరిస్థితి […]

Read More
టోల్​గేట్ షెడ్డు కూలి..

టోల్​గేట్ షెడ్డు కూలి..

భార్యాభర్తల దుర్మరణం సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మహబూబ్ నగర్​ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామ సమీపంలో టోల్​ గేట్​ కోసం  ఏర్పాటుచేసిన షెడ్డు కూలిపోవడంతో భార్యాభర్తలు కృష్ణయ్య, పుష్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శనివారం చోటుచేసుకుంది. పక్కనే ధాన్యం ఆరబోసిన రైతు దంపతులపై షెడ్డు కూలడంతో ప్రాణాలు విడిచారు.

Read More