కాన్పూర్: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఈ క్రిమినల్ పోలీసులకు చిక్కాడు. వికాస్దూబే కోసం మూడు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలించారు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వికాస్దూబే ఉజ్జయినీలోని ఆలయం సమీపంలో కనిపించాడు. గమనించిన ఓ దుకాణ యజమాని పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గత శుక్రవారం వికాస్దూబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఎనిమిది […]
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని యశ్వంత్పూర్ ఏరియాలోని ఓ గెస్ట్హౌస్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. ఆ గెస్ట్హౌస్పై రైడ్ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి చెరలో ఉన్న ఐదుగురు యువతులను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ రైడింగ్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. […]
సారథిన్యూస్, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని వైస్ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ […]
సారథిన్యూస్, రామడుగు: మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక.. నడువలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంగనగర్ జిల్లా రామడుగు మండలం గండికి చెందిన జనగం రాజయ్య (80) కొంతకాలంగా నడవలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష తెలిపారు.
లక్నో: యూపీలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన గ్యాంగ్స్టర్ వికాస్దూబే ప్రధాన అనుచరుడు అమర్దూబేను పోలీసులు కాల్చిచంపారు. ఉత్తర్ప్రదేశ్ హమీర్పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లారు. దీంతో అతడు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అమర్ హతమయ్యాడని ఆరాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్కుమార్ వెల్లడించాడు. అమర్దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది. […]
సారథిన్యూస్, రామడుగు: ఎన్ని సార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మడ్డి లచ్చయ్యకు ముగ్గురు కుమారులు, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు పవన్కల్యాణ్ (23) ఇటీవల ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోని దూలానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని […]
సారథి, హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో రూ. 6600 విలువైన గుట్కాప్యాకెట్లను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఓ ఇంట్లో గుట్కాప్యాకెట్లు నిలువ ఉంచినట్టు పోలీసులకు సమాచారమందింది. దీంతో తనిఖీలు చేసిన అధికారులు గోర్ల శ్రీనివాస్ ఇంట్లో అంబర్ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ కు సహాకరించిన బొయిని వేణుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ సమీపంలోని అనంతారం చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ ఎంబీ చేసి బిల్లు మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు […]