Breaking News

Month: June 2022

కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!

కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!

పేదల కోసం ఏర్పాటుచేసిన మెడికల్​ క్యాంపుపై అక్కసు జీర్ణించుకోలేక రద్దుచేయించిన ఓ బడా నేత సొంతపార్టీ నేతలే క్యాన్సిల్ ​చేయించడంపై ఎమ్మెల్సీ గుస్సా తనకు అడ్డంకులు సృష్టించడంపై కీనుక మరోసారి అధికారపార్టీలో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో పాలిటిక్స్ ​మరింత హీటెక్కుతున్నాయి.. నేతలు బలాబలాలను సరిచూసుకుంటున్నారు.. పోటాపోటీగా పర్యటనలు, కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేపార్టీలో రెండు వర్గాల మధ్య నిశ్శబ్ధయుద్ధం నడుస్తోంది.. […]

Read More
గౌరవెల్లి నిర్వాసిత రైతులపై దాష్టీకం

గౌరవెల్లి నిర్వాసిత రైతులపై దాష్టీకం

భూనిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్​ భయబ్రాంతులకు గురైన రైతులు ఖండించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ సామాజికసారథి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి పూర్తి పరిహారం అందక నిరసనలు చేపడుతున్న భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్​చేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చి నిర్వాహిత రైతులపై కర్కశంగా దాడిచేశాయి. నిర్వాసితులను ఏ పోలీస్​స్టేషన్​కు తరలిస్తున్నారో తెలియకుండా భయబ్రాంతులకు గురయ్యారు.గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై దాడి చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని కాంగ్రెస్ మాజీ […]

Read More
వైభవంగా మహా మండల పూజ

వైభవంగా మహా మండల పూజ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ ఆలయం పున:ప్రతిష్టాపన సందర్భంగా భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం మహా మండల పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుణ్యహవచనం, అభిషేకం, గణపతి నవగ్రహ మన్య సూక్తహోమం భక్తాంజనేయ స్వామి సహస్ర నామావళి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమాలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. గ్రామస్తులు సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వరరావు, రుక్మిణి దంపతులను […]

Read More