Breaking News

Year: 2021

మేడారం ఏర్పాట్ల పరిశీలన

మేడారం ఏర్పాట్ల పరిశీలన

  • December 31, 2021
  • Comments Off on మేడారం ఏర్పాట్ల పరిశీలన

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో జరగనున్న ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క, అధికారులు పరిశీలించారు. మంత్రి జంపన్న వాగులో మొక్కులు చెల్లించి, అనంతరం మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వైస్ […]

Read More
గంగాసాగర్‌ మేళాలో ఆంక్షలుండవ్

గంగాసాగర్‌ మేళాలో ఆంక్షలుండవ్​

కుంభమేళా తరహాలోనే వీటి నిర్వహణ సమీక్షలో స్పష్టంచేసిన సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా: గంగాసాగర్‌ మేళాలో ఎలాంటి కొవిడ్‌ సంబంధిత ఆంక్షలు ఉండబోవని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. కుంభమేళా జరిగినప్పుడు ఇలాంటి ఆంక్షలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌, ఇతర సుదూర ప్రాంతాల నుంచి గంగాసాగర్‌ మేళాలో పాల్గొనేందుకు వచ్చేవారిని ఎలా ఆపగలమని అడిగారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపంలో జనవరి 8 నుంచి 16 వరకు గంగాసాగర్‌ మేళా […]

Read More
అమ్మో.. పులి..?

అమ్మో.. పులి..?

పంటపొలాల్లో పాద ముద్రలు సామాజిక సారథి, నల్లగొండ:  నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెంలో చిరుత పులి కలకలం రేపుతోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. పంట పొలాల్లో ఓ జంతువుకు సంబంధించిన పాదముద్రలను స్థానికులు గమనించారు. వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి పంటపొలాల్లో ఉన్న పాద ముద్రలను పరిశీలించి హైనా పాదముద్రలుగా అనుమానిస్తున్నారు. కాగా, కొంత మంది ప్రత్యక్ష సాక్షులు నిజంగానే చిరుతను చూశామని, దానివెంట పులిపిల్లలు కూడా ఉన్నాయని […]

Read More
జీవోనం.317 నిలిపివేయాలి

జీవోనం.317 నిలిపివేయాలి

ఉద్యోగులతో చర్చించాకే నిర్ణయించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  సామాజికసారథి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అనాలోచిత.. అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోనం.317ను నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే  వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే బదిలీలు చేయమని కోరుతున్నామని చెప్పారు. […]

Read More
తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వాలి

తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వాలి

  • December 31, 2021
  • Comments Off on తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వాలి

నీతిఆయోగ్‌ను కోరిన వినోద్‌ కుమార్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణకు రావాల్సిన నిధులను తక్షణం విడుదలచేయాలని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్​ రాజీవ్‌ కుమార్‌ను కలిసి మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు బి. వినోద్‌కుమార్‌,ఆర్థిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణరావుతో కలసి నీతి ఆయోగ్‌ చైర్మన్‌తో మాట్లాడారు. అనంతరం మీడియాతో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. భేటీలోని అంశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో సెక్షన్‌ […]

Read More
మతోన్మాదం రెచ్చగొడుతున్న బీజేపీ

మతోన్మాదం రెచ్చగొడుతున్న బీజేపీ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజికసారథి, హైదరాబాద్‌: దేశంలో మతోన్మాదశక్తులను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అనే విధంగాపరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజావసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన చట్టాలను వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ప్రశ్నించాల్సిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు రాజకీయ […]

Read More
తరుగు పేరుతో దోపిడీ

తరుగు పేరుతో దోపిడీ

రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు మధ్య దళారులుగా అధికారులు, సింగిల్​విండో చైర్మన్లు ప్రజాప్రతినిధుల మాటలను వినిపించుకోని వైనం క్వింటాలుపై 10కిలోల మేర భోజ్యం ఓ రైతుకు 18 క్వింటాళ్ల తరుగు.. రూ.36వేల నష్టం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నల పంట చివరకు మిల్లర్లు, అధికారులకు కాసులవర్షం కురుస్తోంది. అన్నదాతలకు మాత్రం కష్టమే మిగులుతోంది.పేరుకు మాత్రం పైకి రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రతిఒక్కరూ వారికి అండగా నిలవాల్సిన సమయంలో నిలువునా ముంచుతున్నారు. […]

Read More
షెడ్యూల్‌ ప్రకారమే 5రాష్ట్రాల ఎన్నికలు

షెడ్యూల్‌ ప్రకారమే 5రాష్ట్రాల ఎన్నికలు

  • December 31, 2021
  • Comments Off on షెడ్యూల్‌ ప్రకారమే 5రాష్ట్రాల ఎన్నికలు

జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు గురువారం లక్నోకు వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌చంద్ర స్పష్టత ఇచ్చారు. షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అన్ని రాజకీయపార్టీలు కొవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి సకాలంలో […]

Read More