సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: నిన్న, మొన్నటి వరకు అందరికీ చుక్కలు చూపిన ట’మాంట’ ధర మార్కెట్ లో ఆదివారం దిగి వచ్చింది. రూ. 80 నుంచి వంద పలికిన ధర ఒక్కసారిగా దిగి వచ్చింది. నిన్నటి వరకు 25 కిలోల టమాటా బాక్స్ ధర రూ. వేయి నుంచి 1200 పలుకగా ఆదివారం కూరగాయల మార్కెట్లో రూ. 700 దిగువకు దిగివచ్చింది. దీంతో కిలో టమాట రూ. 40 పలికింది. ఇందుకు లోకల్ టమాట అధికంగా […]
సామాజిక సారథి, కామారెడ్డి: గుండెపోటుకు గురైన ఓ బాధితుడికి చికిత్స చేస్తుండగా వైద్యుడికీ గుండెపోటు వచ్చింది. దీంతో రోగి, వైద్యుడు ఇద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తికి ఛాతి నొప్పి వచ్చింది. దీంతో అతడిని వెంటనే గాంధారిలోని ఓ నర్సింగ్హోమ్కు తరలించారు. బాధితుడికి చికిత్స చేస్తూ వైద్యుడూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. కాసేపటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
సామాజిక సారథి, తల్లాడ: రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు లోపించి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి శనివారం రాత్రి మియాపూర్ కు బయల్దేరిన కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద గుంతలు […]
సామాజిక సారథి, హైదరాబాద్: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్ గౌతమి ఎన్క్లేవ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్క్లేవ్లోని శివదుర్గ అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు. అనంతరం మరో ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే వారు ఎంత సేపటికీ బయటకి రాలేదు. దీంతో మిగతా […]
రైతు కష్టాన్ని నమ్ముకొని జీవిస్తాడు సామాజిక సారథి, ములుగు: భూమాతను అమ్మగా భావించి, కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతన్న జీవితం గొప్పదని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అన్నారు. ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన మమిడిశెట్టి సాంబయ్య, వనమాల దంపతుల మిరుపతోటలో కూలీలతో కలిసి మిరపకాయలు (ఎరారు) కోశారు. రోజంతా పని చేసినందుకు గాను రూ.200ల కూలీ డబ్బులు ఇచ్చారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ నాగరిక సమాజంలో వ్యవసాయం […]
మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సామాజిక సారథి, హాలియా: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షతో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు రెండు రోజుల నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో చేపట్టిన రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ […]
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే ..కోచ్ ఫ్యాక్టరీ సాధించేది కాంగ్రెస్సే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సామాజిక సారథి, కాజీపేట/హన్మకొండ: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం నిర్వహించిన 30 గంటల నిరాహార దీక్షలో అధికార పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు పాల్గొని మద్దతు ఇవ్వడం సిగ్గుచేటుగా ఉందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ దీక్షలో పాల్గొని మాట్లాడారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు […]
సామాజిక సారథి,హాలియా: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. పూలే 131వ వర్థంతి సందర్భంగా హాలియాలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో అనుముల మండల అధ్యక్షుడు […]