Breaking News

Day: June 22, 2021

పచ్చదనంతో అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి

పచ్చదనంతో అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి

సారథి ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలను నాటి పచ్చదనం పెంచి అందమైన జగిత్యాలగా మార్చాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు. జగిత్యాల నుంచి థరూర్ క్యాంప్, రాజరాంపల్లి, నూకపల్లి, మాల్యాల చౌరస్తా రోడ్డు, ముత్యంపేట, దొంగలమర్రి, పుడూరు, తుర్కకాశీనగర్, రైల్వే ట్రాక్ వరకు జాతీయ రహదారి 65కు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న మొక్కలు నాటే పనులను మంగళవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ […]

Read More
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

సారథి, కోడేరు: నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. మండలంలోని కోడేరు, తీగలపల్లి, జనంపల్లి, బావాయ్ పల్లి, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, పసుపుల గ్రామాల అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని బుధవారం ఎంపీడీవో ఆఫీసుకు 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. అలాగే రేమద్దుల, సింగోటం, కల్వకోలు బ్యాంకు ఖాతాదారులు 24వ తారీఖున హాజరుకావాలని ఆయన సూచించారు.

Read More
కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

కొడుకు, కోడలు వేధింపులకు తండ్రి ఆత్మహత్య

సారథి, రామాయంపేట: భూమి కోసం భార్యతో కలిసి కొడుకు వేధించడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం మెదక్​జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో వెలుగుచూసింది. నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ కథనం.. గ్రామానికి చెందిన కట్ట నర్సయ్య(65) తన పేరున ఉన్న 2.10 ఎకరాల భూమిలో పెద్దకొడుకు నర్సింలు భార్య సంపూర్ణపై 20 గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడు. ఈ క్రమంలో చిన్నకొడుకు శ్రీనివాస్ తన తండ్రిని నమ్మించి తన భార్య పేరు మీద […]

Read More
‘నల్లమట్టిని తరలిస్తున్న ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి’

‘నల్లమట్టిని తరలిస్తున్న ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి’

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామ శివారులోని భీమ సముద్రం(చెరువు)లోని నల్లమట్టిని అక్రమంగా తరలిస్తున్న వట్టెం రిజర్వాయర్ హెచ్​ఈసీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, పలువురు రైతులు బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్​ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని, అభ్యంతరం చెబుతున్న రైతులపై దౌర్జన్యానికి దిగుతున్నారని అందులో పేర్కొన్నారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టంచేశారు. వినతిపత్రం అందజేసినవారిలో పోట్టాల బాబు, డొక్కా చెన్నయ్య, మ్యాతరి […]

Read More
నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

నకిలీ విత్తనాలు అమ్మితే కటకటాలే

సారథి, పెద్దశంకరంపేట: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ హెచ్చరించారు. మంగళవారం మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తీసుకున్న విత్తనాలను పరిశీలించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. ఎవరైనా నాసిరకం విత్తనాలను అంటగడితే తమకు సమాచార ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, రైతులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
రాజన్న సన్నిధిలో మాజీ ఎంపీ పొన్నం

రాజన్న సన్నిధిలో మాజీ ఎంపీ పొన్నం

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజారాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే మంగళవారం స్వామివారిని కరీంనగర్​ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదనంతరం వారికి స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. పొన్నం వెంట పలువురు కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More