Breaking News

Day: June 5, 2021

పర్యావరణాన్ని కాపాడుకుందాం

పర్యావరణాన్ని కాపాడుకుందాం

సారథి, బిజినేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం జిల్లా వైద్యాశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటాలని కోరారు. మనుషుల మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి.కృష్ణయ్య, హెల్త్ సూపర్ వైజర్ […]

Read More
ధాన్యం లోడును త్వరగా ఖాళీచేయాలి

ధాన్యం లోడును త్వరగా ఖాళీచేయాలి

మెదక్ ఆర్డీవో సాయిరాం సారథి, పెద్దశంకరంపేట: లారీల్లోని ధాన్యం లోడును వెంటనే ఖాళీచేయాలని మెదక్ ఆర్డీవో సాయిరాం ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. ముందుగా స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాంలోకి వెళ్లి చూశారు. నిర్ణీత వ్యవధిలోనే సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. వచ్చేనెల బియ్యం డబుల్ కోటా వస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని గోదాం ఇన్ చార్జ్ ప్రదీప్ కుమార్ కు […]

Read More
కంటైన్ మెంట్ జోన్ గా చెరుకూరు

కంటైన్ మెంట్ జోన్ గా చెరుకూరు

సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు పంచాయతీలో వారం నుంచి కరోనా వైరస్ ఉధృతి 30శాతం పాజిటివ్ రేటు పెరుగుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా, ఆయన స్పందించి ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా చేయాలని ఆదేశించారు. శుక్రవారం మోతుకులగూడెం, రేగులపాడు, బయ్యారం గ్రామాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రామస్తులను 14రోజుల పాటు వేరే ఊరికి వెళ్లకుండా, ఇతరులు ఆ […]

Read More
సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్

సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్

సారథి, చొప్పదండి: చొప్పదండి జడ్పీ హైస్కూలులో సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేసేందుకు సూపర్ స్ప్రెడర్స్ కు తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అత్యవసరం అయితేనే తప్ప ఎవరూ బయటికి రాకూడదని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజారెడ్డి, కౌన్సిలర్ మహేష్, నాయకులు మహేష్, శ్రీనివాస్ తదితరులు […]

Read More
పేదయువతి పెళ్లికి సాయం

పేదయువతి పెళ్లికి సాయం

సారథి, చొప్పదండి: కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం జన్మదినం సందర్భంగా మల్లన్నపల్లె గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గొల్లె మౌనిక, సురేష్ దంపతుల కూతురు శ్రీవాణి వివాహానికి శనివారం ఆ పార్టీ నాయకులు రూ.5,116 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేసారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గొల్లె సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ […]

Read More
ముందుచూపు లేకే రైతులకు ఇబ్బందులు

ముందుచూపు లేకే రైతులకు ఇబ్బందులు

సారథి, చిన్నశంకరంపేట: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి రైతులు, హమాలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడిసి నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. కొనుగోలు కేంద్రాలు, […]

Read More
ర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

సారథి, జగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా జగిత్యాల జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకరణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధూశర్మ, డీఎఫ్ వో వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ ఒద్ది శ్రీలత రామ్మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Read More
మార్కండేయ లిఫ్ట్ కు పరిపాలన అనుమతులు

మార్కండేయ లిఫ్ట్ కు పరిపాలన అనుమతులు

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హర్షం సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఐదు గ్రామాలు, 17 గిరిజన తండాలకు సాగునీరు అందించే మార్కండేయ లిఫ్ట్ నిర్మాణానికి రూ.76.92 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో నం.211 విడుదల చేసింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బిజినేపల్లి మండలంలోని గంగారం, సాయిన్ పల్లి, మమ్మాయిపల్లి, సాయిన్ […]

Read More