Breaking News

Month: February 2021

ఎన్నికల డ్యూటీని జాగ్రత్తగా నిర్వర్తించాలే

ఎన్నికల డ్యూటీని జాగ్రత్తగా నిర్వర్తించాలే

సారథి న్యూస్, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీని తమకు కేటాయించిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. విధుల పట్ల ఏవైనా అనుమానాలు తలెత్తితే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మార్చి 2న పీవో, ఏపీవోలకు మొదటి విడత, 9న రెండో విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ లో […]

Read More
పంట సాగులో ఎరువులు తగ్గించండి

పంట సాగులో ఎరువులు తగ్గించండి

సారథి న్యూస్, రామాయంపేట: రైతు వేదికలను రైతుశిక్షణ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సతీష్ సూచించారు. మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గురువారం రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలో యూరియాను తగ్గించేయాలని సూచించారు. తక్కువ మోతాదులో వాడితే పంటకు నష్టం తగ్గి.. మంచి దిగుబడి వస్తుందన్నారు. అలాగే పంటలకు తెగుళ్లు వస్తే వాటికి సరిపడా మందులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, […]

Read More
క్రికెట్ చాంపియన్​కొంగాల టీమ్​

క్రికెట్ చాంపియన్ ​కొంగల టీమ్​

సారథి న్యూస్, వాజేడు: మండల కేంద్రంలోని కొంగలలో శ్రీరాములు, బొల్లె ప్రసాద్, బెల్లాల అజయ్ రాంరెడ్డి స్మారకార్థం జగన్నాథపురం యూత్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్​ టోర్నమెంట్​లో కొంగల జట్టు చాంపియన్​గా నిలిచింది. ఈ టోర్నీలో వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం మండలాల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్​లో భాగంగా కొంగల కింగ్స్ లెవెన్, జగన్నాథపురం రైజింగ్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొంగల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 127 […]

Read More
పేదలకు సాయం చేద్దాం

పేదలకు సాయం చేద్దాం.. రండి

సారథి న్యూస్, వెంకటాపూర్: పేదలకు సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. పేదలకు సాయం చేయాలనే సదుద్దేశంతో హృదయ్(ఎన్జీవో) స్వచ్ఛంద సంస్థ సీఈవో షేక్ యాకూబ్ పాషా గూంజ్ సంస్థ సహకారంతో బుధవారం 220 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ముఖ్య​అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. సమాజంలో చాలా మంది ఆకలితో ఆలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాంటి పేదలు ఎక్కడున్నా వారికి చేయూతనందించి దాతృత్వం చాటుకోవాలని […]

Read More
రైతులకు ఉచితంగానే ట్రాన్స్​ఫార్మర్లు

రైతులకు ఉచితంగానే ట్రాన్స్​ఫార్మర్లు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా రైతుల శ్రేయస్సుకు 24 గంటల పాటు ఉచితంగా కరెంట్​ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. రూపాయి ఖర్చులేకుండా రైతులకు ఉచితంగా ట్రాన్స్​ఫార్మర్లను అందిస్తున్నామని తెలిపారు. బుధవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 132/33 కేవీ విద్యుత్​ సబ్​స్టేషన్​ను మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 7,778 మెగావాట్ల సామర్థ్యం […]

Read More
శివనామస్మరణం

శివనామస్మరణం

వైభవంగా శివనారాయణ స్వామి జాతర భక్తుల తాకిడితో కిటకిటలాడిన ఆలయం సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలయోగి శివనారాయణ స్వామి జాతర ఉత్సవం కన్నులపండువగా సాగింది. రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయం కిటకిటలాడింది. స్వామివారి దర్శనంలో భక్తులు తరించిపోయారు. ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 12 మంది దంపతులు లోకకల్యాణార్థం స్వామివారి కల్యాణం జరిపించారు. ఈ మహోత్సవానికి […]

Read More
ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్​

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్​

సారథి న్యూస్, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్​రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.

Read More
నిరుద్యోగుల గొంతునవుతా..

నిరుద్యోగుల గొంతునవుతా..

జై భీమ్ ​యూత్​ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సారథి న్యూస్, హైదరాబాద్: జైభీమ్ ​యూత్ ​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి మంగళవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, పార్ట్ టైం, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని […]

Read More