Breaking News

Month: January 2021

కొత్త సచివాలయం పనుల పరిశీలన

కొత్త సచివాలయం పనుల పరిశీలన

  • January 26, 2021
  • Comments Off on కొత్త సచివాలయం పనుల పరిశీలన

సారథి న్యూస్, హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణ పనులను కె.కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనులను పరిశీలించారు. ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీర్లతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్​ అలీ, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ […]

Read More

ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీల ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. రూ.2 నుంచి రూ.20లక్షల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీచేశారు.ఇవి ప్రోత్సాహకాలు– 2వేలలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.– 2 నుంచి 5వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనుంది.– 5వేల […]

Read More
రైతుల ర్యాలీలో ఉద్రిక్తత

రైతుల ర్యాలీలో ఉద్రిక్తత

న్యూఢిల్లీ: కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించిన రైతులు ఎర్రకోటపై తమ జెండాను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు న‌గ‌రం న‌లువైపులా ర్యాలీ తీశారు. ట్రాక్టర్​ ఢీకొనడంతో ఓ రైతు చనిపోయాడు. అయితే అంతకుముందు ట్రాక్టర్ల ద్వారా దేశరాజధానికి చేరుకుంటున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని […]

Read More
వెల్దండ తహసీల్దార్​కు ఉత్తమ అవార్డు

వెల్దండ తహసీల్దార్​కు ఉత్తమ అవార్డు

సారథి న్యూస్, వెల్దండ: కరోనా విజృంభిస్తుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందించిన సేవలకు గాను నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులుకు ఉత్తమ అధికారి అవార్డు దక్కింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్​ డే వేడుకల్లో కలెక్టర్ ​ఎల్.శర్మన్, జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి ​చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, లాక్​డౌన్​ను మండల వ్యాప్తంగా ఆయన పకడ్బందీగా అమలుచేశారు. కరోనా బాధితులను గుర్తించి, వారికి చికిత్స అందించడంలో కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, కోవిడ్​ 19 […]

Read More
కొట్ర సర్పంచ్​కు ఉత్తమ అవార్డు

కొట్ర సర్పంచ్​కు ఉత్తమ అవార్డు

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వర్​రావుకు ఉత్తమ సర్పంచ్​ అవార్డు దక్కింది. మంగళవారం నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ ​డే వేడుకల్లో కలెక్టర్ ​ఎల్.శర్మన్, జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి చేతులమీదుగా అందుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, ట్యాంకులు, రైతు వేదిక, శ్మశాన వాటిక నిర్మాణంతో పాటు అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు చేపట్టినందుకు ఈ అవార్డు వచ్చిందని సర్పంచ్ ​పి.వెంకటేశ్వర్​ రావు తెలిపారు. ఈ అవార్డు […]

Read More
ఏపీలో పంచాయతీ పోరు షురూ

ఏపీలో పంచాయతీ పోరు షురూ

అమరావతి: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్​లో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్​ ఖరారైంది. రెవెన్యూ డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో పోలింగ్​ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్​ను విడుదల చేసింది. గతంలో చేసిన ప్రకటనను రీ షెడ్యూల్ ​చేసింది. గత షెడ్యూల్ ​ప్రకారం ఫిబ్రవరి 5,9,13,17వ తేదీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. తాజాగా మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్​నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక మొదటి దశ ఎన్నికలకు సంబంధించి జనవరి 29 నుంచి, […]

Read More
రిపబ్లిక్​డే వేడుకల్లో కొత్త శకటాలు

రిపబ్లిక్ ​డే వేడుకల్లో కొత్త శకటాలు

న్యూఢిల్లీ: రిపబ్లిక్​ డే వేడుకలు ఈ సారి విభిన్నంగా వినూత్నరీతిలో కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఎన్నో కొత్త శకటాలు దర్శనమివ్వనున్నాయి. రఫేల్‌ యుద్ధవిమానాలను తొలిసారిగా ఈ ఏడాది పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన ఈ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్‌ లెఫ్ట్‌నెంట్‌ భావనాకాంత్‌ ప్రదర్శనలో పాల్గొననున్నారు. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్‌–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. రిపబ్లిక్​ డే వేడుకల్లో […]

Read More
‘సుకన్య సమృద్ధి యోజన’ ఆడపిల్లలకు వరం

‘సుకన్య సమృద్ధి యోజన’ ఆడపిల్లలకు వరం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడ పిల్లలకు వరం లాంటిదని సంగారెడ్డి సబ్ డివిజన్ మెయిల్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట పోస్ట్ ఆఫీస్ లో పలువురు తల్లిదండ్రులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. కూతుళ్లు పుట్టిన తల్లిదండ్రులకు ఈ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు పోస్టాఫీసును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎస్పీఎం అనిల్ కుమార్, బీపీఎంలు సుదర్శన్, రాఘవేందర్, గంగారాం మామయ్య, విజయ్ కుమార్, సిబ్బంది […]

Read More