హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్లో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగర వాసులను వణికించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్నగర్, కర్మాన్ఘాట్, మీర్పేట, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పాతబస్తీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల […]
జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మొదలు పెట్టిన తన కొత్త సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు మంచు విష్ణు. తను హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణుకు సిస్టర్గా కాజల్ నటిస్తుండగా రుహీసింగ్ హీరోయిన్. సునీల్శెట్టి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచలోనే అతిపెద్ద ఐటీ స్కాం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. చాలా గ్యాప్ తరువాత వస్తున్న […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్పై దేశ ద్రోహం కేసు నమోదైంది. మహారాష్ట్ర సర్కారుపై ఢీ అంటే ఢీ అంటూ ఇటీవల వార్తల్లో పెను సంచలనంగా మారిన కంగనా రనౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ట్వీట్లు చేస్తోంది. అయితే ఆమె చేస్తున్న ట్వీట్లతో పాటు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ముంబై […]
మొదటి రోజు శైలపుత్రికగా జోగుళాంబ అమ్మవారు అక్టోబర్ 25వ తేదీ వరకు వేడుకలు సారథి న్యూస్, అలంపూర్, మెదక్: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శనివారం దేవీశరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్19 నిబంధనల మేరకు ఆర్భాటాలకు దూరంగా సంప్రదాయాలు ఉట్టిపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు జోగుళాంబ అమ్మవారిని నవదుర్గాల్లో ఒకరిగా అలంకరించి ఆరాధించడం ఆనవాయితీ. మొదటి రోజు కావడంతో జోగుళాంబ అమ్మవారు […]
సారథి న్యూస్, రామాయంపేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కిరోసిన్పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన దేవసాని రేవతి(19) రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించినా నయం కాకపోవడం, అలాగే తన కుటుంబసభ్యులు తనకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అనారోగ్యంతో ఉంటూనే ఇప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనంతట తాను ఒంటిపై కిరోసిన్ పోసుకుని […]
సారథి న్యూస్, కంగ్టి: నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో చోటు చేసుకుంది. కురుమ గాయత్రి(8) తల్లితో కలిసివెళ్లి శనివారం ఉదయం బట్టలు ఉతకడానికి గ్రామ శివారులోని నీటి కుంటలోకి దిగి బట్టలు ఉతుకుతున్న సమయంలో కాలు జారీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి చూడగానే శ్వాస ఆడక కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి సృహకోల్పోయింది. నీటిలో మునిగిన బిడ్డను బయటికి […]
ముంబై: టీవీ చానళ్లలో టీఆర్పీ కుంభకోణం నేపథ్యంలో బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చి కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని భాషల్లోని వార్తా చానళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 12వారాల పాటు (మూడు నెలలు) రేటింగ్ను ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం టీవీ రేటింగ్ ఇవ్వడానికి గల ప్రమాణాలను సమీక్షించి, రేటింగ్ ప్రక్రియను ఆధునిక సాంకేతికత సాయంతో మెరుగుపర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది. బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) స్వాగతించింది. బార్క్ నిర్ణయం సాహసోపేతమైనదని, […]
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న రామ్ చరణ్.. మరోవైపు ‘ఆచార్య’ సినిమాలోనూ కీలకపాత్ర పోషించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ నటించబోయే సినిమా ఏమిటి? డైరెక్టర్ ఎవరు లాంటి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది టాలెంటెడ్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు, ఎడిటర్ మోహన్ కొడుకు మోహన్ రాజా పేరు తెరపైకి వచ్చింది. మోహన్ […]