Breaking News

Day: August 26, 2020

కిషన్​రెడ్డి వెబ్​సైట్​ హ్యాక్

న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి వ్యక్తిగత వెబ్​సైట్​ హ్యాక్​కు గురైంది. తన వెబ్​సైట్​లో పాకిస్థాన్​కు అనుకూలంగా పోస్టులు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను హ్యాక్​చేసిన దుండగులు ‘అందులో కశ్మీర్​ ఆజాదీ’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో పాటు మనదేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయంపై కిషన్​రెడ్డి సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తోంది. కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను ఉగ్రవాదులు హ్యాక్​ […]

Read More

చంద్రబాబూ.. డ్రామాలు ఆపు

సారథిన్యూస్​, అమరావతి: అమరావతిపై పోల్​ పేరిట మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తనాటకానికి తెరలేపారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ( ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు మండిపడుతున్నారన్నారు. అమరావతి పేరుమీద చంద్రబాబు దొంగపోల్స్‌ పెడుతున్నారన్నారు. పచ్చ మీడియా నిర్వహించే పోల్స్​లో ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు ఎలా వ్యవహరించారో ప్రజలింకా మరిచిపోలేదన్నారు. తన ఎత్తుగడలతో ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు దుష్టపన్నాగాలు […]

Read More

ఎమ్మెల్యే భూమనకు కరోనా

సారథిన్యూస్​, తిరుపతి: వెఎస్సార్​ కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇటీవల భూమన కరుణాకర్​రెడ్డి కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉన్న భూమన.. కరోనా బారిన పడి మృతిచెందిన వారికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు భూమన త్వరగా కోలుకోవాలని వైసీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

Read More