సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజలకు పోలీసే మంచి స్నేహితుడని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ ద్వారా ఫ్రెండ్స్షిప్ డే ప్రాముఖ్యతను చెప్పారు. ‘ప్రజల ప్రతి అవసరంలోనూ స్పందించే వాడు, ప్రజలకు భద్రత, రక్షణ కల్పించేవాడు, అనునిత్యం ప్రజల క్షేమం గురించి ఆలోచించేవాడు పోలీసును మించిన మరో స్నేహితుడు లేడు. చట్టానికి, సమాజానికి కట్టుబడి ఉండే ప్రతి ఒక్కరికీ పోలీసుల కంటే మంచి స్నేహితుడు ఉండబోరు..’ అని అన్నారు. […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమిత్ షా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్ చేయాలి అప్పడే వ్యాధిని […]
సారథి న్యూస్, చేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని శంకర్ పల్లి లో నూతనంగా రూ.50లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసును ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ)లో భాగమైన గుడిపల్లి లిఫ్ట్ -3 నుంచి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణాజలాలు కాల్వల వెంట పరుగులు తీశాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఎల్ శర్మన్, సర్పంచ్లు, […]
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నది. ఇప్పటికే బాలీవుడ్లోని నెపోటిజంపై పలువురు సీనీ నటులు, ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ అందాల భామ తనూశ్రీ దత్తా సుశాంత్ కేసుపై స్పందించారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని తనకు అనుమానంగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడమే ఉత్తమమని ఆమె వ్యాఖ్యానించారు. ముంబై పోలీసులను పూర్తిగా నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. వారు రాజకీయనాయకుల […]
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. జూలై 30న న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చేరారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జ్ చేసినట్టు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. కాగా.. గత ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రముఖ సినీ నిర్మాత దివంగత ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్కు కొంత కాలంగా తీవ్రమైన ఘర్షణ జరుగుతున్నది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు కేసులు పెట్టుకొనే స్థాయిలో గొడవపడ్డారు. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణమేమీటోనని సినీవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ నిర్మాత ఎల్వీ ప్రసాద్ చెన్నైలోని తన స్టూడియోలో ఓ పెద్ద గదిని ఇళయరాజాకు బహుమతిగా ఇచ్చారు. ఆ గదిలోనే ఇళయరాజా మ్యూజిక్ స్టూడియోను ఏర్పాటుచేసుకొని .. దాన్ని వాడుకుంటున్నారు. […]